iDreamPost
android-app
ios-app

కానిస్టేబుల్ రమేశ్.. ఆ ఒక్క పని చేసి ఉంటే బతికేవాడు!

కానిస్టేబుల్ రమేశ్.. ఆ ఒక్క పని చేసి ఉంటే బతికేవాడు!

కానిస్టేబుల్‌ రమేష్‌ ను అతడి భార్య శివానీ అలియాస్ శివ జ్యోతే అత్యంత దారుణంగా హత్య చేసింది. వైజాగ్ లో మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ప్రియుడి మోజులో పడి మూడుముళ్లు వేసిన భర్తనే.. చంపేసిందా? అని జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భర్తను దారుణంగా చంపి..ఏం తెలియనట్లు.. తన భర్త గుండెనొప్పితో మృతి చెందాడంటూ శివాని పోలీసులను నమ్మించింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు తెలిశాయి. అయితే ఈ ఘటనలో కానిస్టేబుల్ రమేష్ తప్పు కూడా ఉందని.. అతడి మరణంపై బాధపడుతున్న కొందరు అన్నారు. రమేశ్  ఆ ఒక్క పని చేసి ఉంటే బతికి ఉండే వాడని స్థానికులు ఉంటున్నారు. మరి… ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

శివాని అలియాస్ శివజ్యోతికి రమేశ్ అనే కానిస్టేబుల్ తో 11 ఏళ్ల క్రితం  వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రమేశ్ విధుల్లో బిజీ బిజీగా ఉండే వాడు. అలానే కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకునేవాడు. ఇలా హాయిగా సాగుతున్న వారి సంసారంలో శివానీ బుద్ది వక్రమార్గంలోకి వెళ్లింది. భర్త బయట కష్ట పడి సంపాదిస్తుంటే.. ఆ విలువ తెలుసుకోలేక పోగా.. పరాయి మగాడి సుఖం కోసం చూసింది. ఈ క్రమంలోనే ఎదురింట్లో ఉన్న రామారావు అనే ఆటో డ్రైవర్ తో స్నేహం పెంచుకుని అక్రమ సంబంధం ఏర్పర్చుకుంది.

ఇక అతడి మోజులో పడి భర్త  ఉన్నాడనే విషయాన్నే పట్టించుకోలేదు. చాలా కాలం పాటు వీరి రంకుతనం గుట్టుగా సాగింది. అయితే ఒకసారి శివాని, రామరావుల వివాహేతర సంబంధం గురించి రమేశ్ కి తెలిసింది. మరోసారి ఇలాంటి పనులు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. రమేశ్ మాటలను శివాని పెడచెవిన పెట్టింది. మళ్లీ… రామారావుతో అక్రమ సంబంధం కొనసాగించింది. ఈ క్రమంలో రమేశ్ కి శివానీకి మధ్య గొడవలు జరిగాయని స్థానికులు అంటున్నారు. ఇక ప్రియుడికి, తనకు మధ్య భర్త అడ్డుగా వస్తున్నాడని పుల్ గా మద్యం తాగించి హత్య చేసింది. ప్రియుడితో కలిసి దిండుతో హత్య చేసింది. ఆమెకు డ్రగ్స్ అలవాటు కూడా ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. అయితే ఈ దారుణ హత్యపై కుటుబం సభ్యులు స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆమెకు వివాహేత సంబంధం ఉందని తెలిసి..తనను చంపేస్తాదని తెలిసి కూడా పిల్లల కోసం శివానీతో ఉండటమే రమేశ్ ప్రాణాల పోయేలా చేసిందని అంటున్నారు. శివాని బుద్ధి తెలిసి కూడా అలా చేయకుండా.. ఆమెతోనే ఉండి రమేశ్ ప్రాణాలు పొగొట్టుకున్నాడని స్థానికులు అంటున్నారు. శివాని నుంచి దూరంగా రాకపోవడమే రమేశ్ చేసిన పాపమని.. బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు దూరంగా వచ్చి ఉంటే.. ఈ రోజు ప్రాణాలతో ఉండే వాడని వారు వాపోతున్నారు. మరి.. స్థానికులు, బంధువులు అన్నట్లు.. రమేశ్ చేసిన ఆ ఒక్క తప్పే.. ఆయనను బలి తీసుకుందా?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కానిస్టేబుల్‌ రమేష్‌ కేసులో మరో ట్విస్ట్.. శివాని అక్క చెప్పిన సంచలన నిజాలు!

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş