iDreamPost
android-app
ios-app

ఆత్మ సాక్షి ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. APలో మళ్లీ అధికారం YSRCPదే! ఎన్ని సీట్లు అంటే?

Atma Sakshi Exit Poll 2024: ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీకి తిరుగులేదని మరోసారి స్పష్టమైంది. సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు శనివారం సాయంత్రం వెల్లడయ్యాయి.

Atma Sakshi Exit Poll 2024: ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీకి తిరుగులేదని మరోసారి స్పష్టమైంది. సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు శనివారం సాయంత్రం వెల్లడయ్యాయి.

ఆత్మ సాక్షి ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. APలో మళ్లీ అధికారం YSRCPదే! ఎన్ని సీట్లు అంటే?

శనివారం దేశ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్1వ తేదీన  ఏడో విడత పోలింగ్ తో  పార్లమెంట్ ఎన్నికల సమరం ముగిసింది. ఇదే సమయంలో ఇక అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ పై  పడింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై  అందరిలో ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో దేశ ప్రజలందరి చూపు ఏపీ ఫలితాలపై ఉంది. ఈ క్రమంలోనే ఏపీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ప్రముఖ సర్వే సంస్థ ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ సర్వేలను విడుదల చేసింది. మరి.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం…

ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీకి తిరుగులేదని మరోసారి స్పష్టమైంది. సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు శనివారం సాయంత్రం వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించి మళ్లీ అధికారంలోకి రానుందని ఆత్మసాక్షి ఎగ్జిట్‌పోల్ తేల్చి చెప్పింది. వైఎస్సార్‌ సీపీ విజయ భేరి మోగించనుందని స్పష్టం చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 98  నుంచి 116 వరకు వస్తాయని ఆత్మసాక్షి సంస్థ అంచనా వేసింది. ఇదే సమయంలో టీడీపీ కూటమికి 59-77 వస్తాయని ఆత్మసాక్షి సంస్థ అంచనా వేసింది.  ఇక తాజాగా ఆత్మ సాక్షి విడుదల చేసిన ఎగ్జిట్ ఫలితాలు చూసి..వైఎస్సార్ సీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చూస్తున్నారు. తమ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఎగ్జిట్ ఫలితాలు ఆసక్తిని మరింత పెంచాయి. ఇక అందరూ జూన్ 4వ తేదీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఇక ఆత్మసాక్షి విడుదల చేసే గత సర్వే ఫలితాలను చూసినట్లు  అయితే.. చాలా వరకు నిజమయ్యాయి. 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో ఆ సంస్థ చెప్పిన దగ్గరకి వచ్చాయి. ఇక తాజాగా ఆత్మసాక్షి విడుదల చేసిన ఎగ్జిట్ ఫలితాలు చూసి..వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చూస్తున్నాయి. తమ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఉత్కంఠను మరింత పెంచాయి.