Vijayawada: భర్తను కాదనుకుని.. మరోకరితో సహజీవనం.. ప్రియుడు చేసిన పనికి

Vijayawada: భర్తను కాదనుకుని.. మరోకరితో సహజీవనం.. ప్రియుడు చేసిన పనికి

Vijayawada Nunna Married Woman Death: విభేదాల వల్ల భర్తతో దూరంగా ఉంటున్న మహిళ.. మరోకరిని ప్రేమించింది. కానీ ప్రియుడు చేసిన పనికి తట్టుకోలేక దారుణ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

Vijayawada Nunna Married Woman Death: విభేదాల వల్ల భర్తతో దూరంగా ఉంటున్న మహిళ.. మరోకరిని ప్రేమించింది. కానీ ప్రియుడు చేసిన పనికి తట్టుకోలేక దారుణ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

ఆవేశం మనిషి ఆలోచనలని చంపేస్తుంది. దాంతో సెకన్ల వ్యవధిలోనే దారుణాలు జరిగిపోతుంటాయి. ప్రస్తుతం సమాజంలో చోటు చేసుకునే అనేక నేరాలకు ఈ క్షణికావేశమే చాలా వరకు కారణం. కోపంలో ఉన్నప్పుడు మనిషి ఆలోచించే శక్తిని కోల్పోతాడు. ఫలితంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. దాని ఎఫెక్ట్‌ జీవితాంతం ఉండటమే కాక.. కుటుంబాలే నాశనం అవుతాయి. కాసేపు మన మనసుని, మెదడును కంట్రోల్‌ చేసుకోగలిగితే.. చాలా వరకు దారుణాలు అరికట్టగలము. కానీ నేటి సమాజంలో ఎవరికి అంత ఓపిక ఉండటం లేదు. చిన్నారులు మొదలు.. పెద్దవారి వరకు చిన్న సమస్యల వచ్చినా సరే.. ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నారు. ఆవేశంలో ప్రాణాలు తీసుకుని కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి వెలుగు చూసింది.

భర్తతో విభేదాల కారణంగా విడిపోయి ఒంటిరిగా ఉంటుంది ఓ మహిళ. ఈ క్రమంలో మరో వ్యక్తితో ఆమెకు ఏర్పడిన పరిచయం కాస్త సహజీవనానికి దారి తీసింది. అయితే ప్రియుడు చేసిన పనికి తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన మహిళ.. దారుణ నిర్ణయం తీసుకుంది. బిల్డింగ్‌ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్‌, విజయవాడ, నున్నలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాకు చెందిన మూర్తి అనే వ్యక్తికి.. కండ్రికకు చెందిన హైమావతి అనే మహిళతో వివాహం అయ్యింది. అయితో భర్తతో విభేదాల కారణంగా.. గత కొన్నాళ్లుగా హైమావతి అతడికి దూరంగా ఉంటుంది. ప్రస్తుతం విజయవాడలో రకరకాల వేడుకలకు ఈవెంట్స్‌ చేస్తూ.. జీవనంన సాగిస్తోంది. ఇదిలా ఉండగా.. హైమావతికి కొన్నాళ్ల క్రితం మహేష్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారింది. ప్రస్తుతం వీరిద్దరు నున్నలోని మహేష్‌ టవర్స్‌ అపార్ట్‌మెంట్‌లో కలిసే ఉంటున్నారు. అయితే ఇటీవల మహేష్‌ ప్రవర్తనలో మార్పు వచ్చింది. అతడు వేరే మహిళతో మాట్లాడుతున్నాడు. ఇది కాస్త హైమావతికి తెలిసింది. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఆ తర్వాత హైమావతి.. శ్రీనగర్‌ కాలనీలో ఉండే తన స్నేహితురాలు భవాని ఇంటికి వద్దకు వెళ్లింది. తన సమస్య గురించి ఆమెకు చెప్పుకుంది. మహేష్‌ ఆదివారం సాయంత్రం భవాని ఇంటి వద్దకు వచ్చాడు. హైమావతితో మాట్లాడాడు. మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. ఆ తర్వాత మహేష్‌ భవాని ఇంటి వద్ద నుంచి నున్న వెళ్లిపోయాడు. దాంతో హైమావతి, భవానీ మరో ఇద్దరితో కలిసి నున్న వచ్చింది. మహేష్‌తో ఒంటరిగా మాట్లాడుతానని.. అతడి నివాసం వద్దకు వెళ్లింది. మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. మహేష్‌తో మాట్లాడానికి వెళ్లిన కాసేపటికే.. స్నేహితురాళ్లు చూస్తుండగానే.. ఐదో అంతస్తు నుంచి కిందకు దూకింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show comments