iDreamPost

ఒకే స్టేజ్ పై రజనీ, జూ. ఎన్టీఆర్

ఒకే స్టేజ్ పై రజనీ, జూ. ఎన్టీఆర్

నవంబర్ 1న అనగా నేడు దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక రత్న అవార్డు ప్రదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని రాష్ట్ర ప్రభుత్వం నటులు రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్‌లను ఆహ్వానించింది.

అయితే పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మొదటి సినిమా అప్పుకు రజనీకాంత్ కు, పునీత్ రాజ్ కుమార్ తో యంగ్ టైగర్ ఎన్డీఆర్ కు ప్రత్యేక అనుభంధం, కొంచెం ప్లాష్ బ్యాక్ ఉంది.

karnataka ratna, Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ కోసం వస్తున్న రజినీకాంత్, ఎన్టీఆర్ - rajinikanth and jr ntr coming for karnataka ratna to puneeth raj kumar - Samayam Telugu

జూనియర్‌ ఎన్‌టీఆర్‌ తల్లి ఉడిపి జిల్లా కుందాపురకు చెందినవారు కావడంతో ఆయనకి కన్నడ భాష, కర్ణాటక రాష్ట్రంతో పాటు కన్నడిగులన్నా ప్రత్యేక అభిమానం ఉంది. ఇక తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా ఇదే కార్యక్రమంలో పాల్గొంటారు. కన్నడ కంఠీరవ డాక్టర్‌ రాజ్‌కుమార్‌ కుటుంబీకులతో రజనీకాంత్‌కు దశాబ్దాల కాలంగా సన్నిహిత సంబంధం ఉంది.

ఇక అవార్డు విషయానికోస్తే ఈ అవార్డు వెండితో చేసిన ప్రశంసా పత్రం మరియు 50 గ్రాముల బంగారు పతకాన్ని కలిగి ఉంటుంది. రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న తొమ్మిదవ మరియు అతి పిన్న వయస్కుడైన వ్యక్తి పునీత్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి