iDreamPost

పవన్ కళ్యాణ్ కు అనారోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్స్!

  • Author Soma Sekhar Published - 01:13 PM, Tue - 27 June 23
  • Author Soma Sekhar Published - 01:13 PM, Tue - 27 June 23
పవన్ కళ్యాణ్ కు అనారోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పవన్ చేపట్టిన వారాహి యాత్రలో భాగంగా.. ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. దాంతో ఈ వార్త తెలియగానే పవన్ ఫ్యాన్స్ ఆందోళనకు గురౌతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అస్వస్థతకు గురైయ్యారు. ప్రస్తుతం వారాహి యాత్రలో ఫుల్ జోష్ లో పాల్గొంటున్నారు ఆయన. వారాహి యాత్రలో భాగంగా.. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు జనసేనాని. అక్కడ ఉపవాస దీక్షలో ఉండటంతో.. నీరసించి స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దాంతో పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ అస్వస్థతకు లోను కావడంతో.. ఈరోజు ఉదయం 11 గంటలకు భీమవరం నియోజకవర్గ నేతలతో నిర్వహించాల్సిన భేటీని వాయిదా వేసినట్లు సమాచారం. ఈ భేటీ మధ్యాహ్నం తర్వాత ప్రారంభం కానుంది. ఇతర పార్టీలకు చెందిన కొంత మంది నేతలు జనసేనలో ఈ భేటీ అనంతరం చేరనున్నారు. ఇక పవన్ కు అనారోగ్యం అన్న వార్త తెలియగానే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నాయకుడికి ఏమైందని ఆరా తీస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి