iDreamPost

వీడియో: యానిమల్ కాదు.. మహేశ్ మూవీలో అది డబుల్: సందీప్ వంగా!

తొలి మూవీతో అర్జున్ రెడ్డితోనే ఇండస్ట్రీని షేక్ చేసేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి మూవీ విజయ్ దేవర కొండ కెరీర్‌కు బాటలు వేయడమే కాకుండా.. ఇలాంటి మూవీ చేయలేకపోయామని హీరోలు సైతం ఫీల్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు యానిమల్ మూవీతో రాబోతున్నాడు ఈ డైరెక్టర్.

తొలి మూవీతో అర్జున్ రెడ్డితోనే ఇండస్ట్రీని షేక్ చేసేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి మూవీ విజయ్ దేవర కొండ కెరీర్‌కు బాటలు వేయడమే కాకుండా.. ఇలాంటి మూవీ చేయలేకపోయామని హీరోలు సైతం ఫీల్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు యానిమల్ మూవీతో రాబోతున్నాడు ఈ డైరెక్టర్.

వీడియో: యానిమల్ కాదు.. మహేశ్ మూవీలో అది డబుల్: సందీప్ వంగా!

రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం యానిమల్. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ విడుదలై.. సినిమాపై అంచనాలు పెంచేసింది. తండ్రి, కొడుకుల మధ్య బంధం.. అలాగే కొన్ని వయెలెన్స్ సీన్స్ చూసి.. మరో భారీ హిట్ ఖాయమని భావిస్తున్నారు. డిసెంబర్ 1న పాన్ ఇండియా విడుదల కాబోతుంది ఈ పిక్చర్. విజువల్ టేకింగ్, మ్యూజిక్ చూసి మూవీ ఓ రేంజ్‪లో ఉండబోతుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైన సంగతి విదితమే. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం హైదరాబాద్ మల్లా రెడ్డి యూనివర్శిటీలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నారు.

అయితే గత కొన్ని రోజులుగా ఈ మూవీ మహేష్ బాబుతో చేయాల్సి ఉందని, ఎక్కడో వర్క్ అవుట్ కాక.. ఆ స్క్రిప్టు రణబీర్‌కు చేరిందని గుసగుసలు వినిపించాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహేష్ ఈ ప్రాజెక్టులో కనిపించాల్సి ఉందన్న వార్తలపై ఓ జర్నలిస్ట్.. ఆయనకు చెప్పిందీ ఇదే స్క్రిప్టా, లేకుంటే మరోటి అయ్యి ఉంటే ఇంతే వయెలెన్స్ ఉండేదా అన్న ప్రశ్నకు డైరెక్టర్ సందీప్ క్లారిటీ ఇచ్చారు. మహేష్‌తో చేద్దామనుకున్న మూవీ పేరు డెవిల్ అని చెప్పాడు. క్యారెక్టరేజైషన్ సమాంతరంగా ఉండేదన్న డైరెక్టర్.. అది వేరే స్క్రిప్ట్, ఇది వేరోదనని స్పష్టతనిచ్చారు. ఇక వయెలెన్స్ విషయానికి వస్తే.. డెవిల్ మూవీలో ఎక్కువనే చూపించేవాడినని, అది అనుకోకుండా జరగలేదన్నారు.

ఆ మూవీ మహేష్ బాబు రిజెక్ట్ చేశారని అనుకుంటున్నారని, అది వర్కౌట్ అవ్వలేదంతే అని చెప్పారు. భవిష్యత్తులో చూడొచ్చా అని అడిగితే.. అవుననే సమాధానం ఇచ్చారు. తొలి మూవీతోనే ఇండస్ట్రీని షేక్ చేసేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ దేవర కొండ కేరీర్ లోనే ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కేవలం 4-5 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం 2017లో విడుదలై 100 రెట్లకు పైగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ కేవలం టాలీవుడ్‌లోనే కాదూ.. బాలీవుడ్ సైతం చర్చించుకునేలా చేసింది. విజయ్ దేవర కొండ చాలా మంది హీరోయిన్లకు హాట్ ఫేవరేట్ అయిపోయాడు. అతడితో సినిమాలు చేసేందుకు చాలా మంది నటీమణులు ఇంట్రస్ట్ కూడా చూపించారు. రెండేళ్ల విరామం తర్వాత ఈ మూవీని హిందీలోనూ కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించాడు డైరెక్టర్ సందీప్. అక్కడ భారీ హిట్ అందుకుందీ ఈ మూవీ. ఇప్పుడు ప్రభాస్‌తో స్పిరిట్ మూవీని టేకప్ చేస్తున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి