iDreamPost
android-app
ios-app

నేడే విశాఖలో ఇండియా – సౌత్ ఆఫ్రికా మూడో T20.. ట్రాఫిక్ ఆంక్షలు..

  • Published Jun 14, 2022 | 10:20 AM Updated Updated Jun 14, 2022 | 10:20 AM
నేడే విశాఖలో ఇండియా – సౌత్ ఆఫ్రికా మూడో T20.. ట్రాఫిక్ ఆంక్షలు..

ఇండియా – సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న అయిదు మ్యాచ్ ల T20 సిరీస్ లో ఇప్పటికే భారత్ రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. సిరీస్ గెలవాలంటే కచ్చితంగా మిగిలిన మూడు మ్యాచ్ లు గెలిచి తీరాల్సిందే. దీంతో భారత టీంపై మరింత ఒత్తిడి పెరిగింది. నేడు(జూన్ 14) విశాఖలో ఇండియా-సౌత్ ఆఫ్రికా మధ్య మూడవ T20 మ్యాచ్ జరగనుంది.

ఇప్పిటికే రెండు జట్లు విశాఖ చేరుకున్నాయి. మ్యాచ్ చూసేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ అభిమానులు. దాదాపు 1500 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మ్యాచ్ టికెట్లు అన్నీ పెట్టిన గంటకే అమ్ముడుపోయాయి. దీంతో జనాలు భారీగా వచ్చే అవకాశం ఉంది. విశాఖలో మ్యాచ్ జరగనుండటంతో మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షాలు విధించారు. మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలవ్వనుంది.

 

 

 

marsbahis girişgamdom girişjojobet girişjojobet girişsiteye git