iDreamPost

DRS తీసుకోవాలా? వద్దా? అనేది అతనికే వదిలేశా: రోహిత్‌ శర్మ

  • Author singhj Published - 04:10 PM, Fri - 3 November 23

శ్రీలంకతో మ్యాచ్ తర్వాత డీఆర్ఎస్ పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ విషయంలో నిర్ణయాన్ని అతడికే వదిలేశానన్నాడు.

శ్రీలంకతో మ్యాచ్ తర్వాత డీఆర్ఎస్ పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ విషయంలో నిర్ణయాన్ని అతడికే వదిలేశానన్నాడు.

  • Author singhj Published - 04:10 PM, Fri - 3 November 23
DRS తీసుకోవాలా? వద్దా? అనేది అతనికే వదిలేశా: రోహిత్‌ శర్మ

వన్డే వరల్డ్ కప్-2023లో భారత్ దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. బ్రేకుల్లేని బుల్డోజర్​లా మెగా టోర్నీలో దూసుకెళ్తున్న టీమిండియా వరుసగా ఏడో మ్యాచ్​లో విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్​లో శ్రీలంకపై ఏకంగా 302 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్​లో ఫస్ట్ ప్లేస్​కు చేరుకున్న రోహిత్ సేన.. అధికారికంగా సెమీఫైనల్​ బెర్త్​ను దక్కించుకుంది. భారత్ ఇంకా రెండు మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. అందులో ఒకటి సౌతాఫ్రికాతో కాగా.. మరొకటి నెదర్లాండ్స్​తో ఆడాల్సి ఉంది. ఆల్రెడీ సెమీస్​కు క్వాలిఫై అయినందున ఈ రెండు మ్యాచుల్లో కొందరు ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

సౌతాఫ్రికా, నెదర్లాండ్స్​తో మ్యాచుల్లో ప్రయోగాలు చేసేందుకు కూడా టీమిండియాకు అవకాశం ఉంది. అయితే విన్నింగ్ స్ట్రీక్​ను మెయింటెయిన్ చేయాలంటే మాత్రం అదే టీమ్​తో వెళ్లొచ్చు. ఇదిలా ఉంటే.. లంకపై విజయం తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమ్ మొత్తం సమష్టిగా ఆడటం వల్లే ఇది సాధ్యమైందన్నాడు. సెమీస్​కు అఫీషియల్​గా క్వాలిఫై అవ్వడం సంతోషంగా ఉందన్నాడు. చెన్నైలో స్టార్ట్ అయిన తమ వరల్డ్ కప్ జర్నీలో ఫస్ట్ టార్గెట్ పూర్తయిందన్నాడు రోహిత్. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచడం తమకు దక్కిన గొప్ప సవాల్ అన్నాడు. లంకపై గెలుపులో క్రెడిట్ పేసర్లకు ఇవ్వాలన్నాడు రోహిత్ శర్మ. అసాధారణ బౌలింగ్​తో పేసర్లు అదరగొట్టారని మెచ్చుకున్నాడు.

బుమ్రా, సిరాజ్, షమీలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలరన్నాడు రోహిత్. శ్రేయస్ అయ్యర్ సత్తా ఏంటో తమకు తెలుసన్నాడు. అతడి పవర్ ఏంటో మరోమారు చూపించాడని ప్రశంసించాడు హిట్​మ్యాన్. ఈ సందర్భంగా డీఆర్ఎస్​ పైనా రోహిత్ కామెంట్స్ చేశాడు. డీఆర్ఎస్ నిర్ణయంలో తాను జోక్యం చేసుకోనని.. ఆ డెసిజన్​ను పూర్తిగా కీపర్ కేఎల్ రాహుల్​కే వదిలేశానన్నాడు. రెండు రివ్యూలు తీసుకుంటే ఒకటి తమకు అనుకూలంగా.. మరొకటి ప్రతికూలంగా వచ్చిందన్నాడు. డీఆర్ఎస్ తీసుకోవాలా? వద్దా? అనేది రాహుల్​కు, బౌలర్లకే వదిలేశానని రోహిత్ స్పష్టం చేశాడు. మరి.. డీఆర్ఎస్ విషయంలో కీపర్​, బౌలర్​కు రోహిత్ స్వేచ్ఛను ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: శ్రీలంకపై టీమిండియా విజయం! ఊహించని కామెంట్స్‌ చేసిన అక్తర్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి