iDreamPost

ఇద్దరిని బలితీసుకున్న వివాహేతర సంబంధం

ఇద్దరిని బలితీసుకున్న వివాహేతర సంబంధం

వివాహేతర సంబంధం ఇద్దరిని బలితీసుకుంది. ఒకరిని వదిలి ఒకరు ఉండలేమనుకున్నారేమో.. బలవన్మరణానికి పాల్పడ్డారు. తమిళనాడులోని తిరుపూర్ జిల్లా తారాపురం ప్రాంతంలో వివాహేతర ప్రేమజంట విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. తారాపురం ప్రాంతంలో పూవాడిపాలెంకు చెందిన కార్మికుడు మణికంఠన్ కు భార్య, కొడుకు-కూతురు ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన నటరాజన్ – యమ్మాల్ (40) దంపతులకు కూతురు – కొడుకు ఉన్నారు. మూడు నెలల క్రితం నటరాజన్ గుండెపోటుతో మరణించాడు.

నటరాజన్ మరణం తర్వాత.. మణికంఠన్ – యమ్మాల్ ల మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసిన బంధువులు ఇరువురినీ మందలించారు. రెండ్రోజుల క్రితం వారిద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. మణికంఠన్ – యమ్మాల్ ల కోసం బంధువులు ఎంతవెతికినా కనిపించలేదు. బొమ్మనాయకన్‌ పట్టి, పవన విద్యుత్‌ కేంద్రం ప్రాంతంలో ఒక జంట మృతి చెందినట్లు బుధవారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు పరిశీలించగా చనిపోయిన వారు మారియమ్మాల్, మణికంఠన్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి