iDreamPost

పవన్ కళ్యాణ్ పై కేసు.. విచారణ రేపటికి వాయిదా!

  • Author Soma Sekhar Published - 06:49 PM, Mon - 24 July 23
  • Author Soma Sekhar Published - 06:49 PM, Mon - 24 July 23
పవన్ కళ్యాణ్ పై కేసు.. విచారణ రేపటికి వాయిదా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపాయి వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. వాలంటీర్లు వుమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. దాంతో పవన్ పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ మహిళా వాలంటీర్ పవన్ కళ్యాణ్ పై పరువు నష్టం కేసును దాఖలు చేసిన విషయం తెలిసిందే. పవన్ తమపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర మనోవేదనకు గురిచేశాయని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యాఖ్యలపై విజయవాడ సివిల్ కోర్టులో పవన్ కళ్యాణ్ పై పరువు నష్టం కేసును వేసింది ఓ మహిళా వాలంటీర్. ఈ క్రమంలోనే ఈ కేసులో విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తమను తీవ్ర మనోవేదనకు గురిచేశాయని సదరు మహిళ పిటీషన్ లో తెలియజేశారు. ఈ వ్యాఖ్యలపై విచారణ జరిపి పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని పిటీషన్ లో ఆ మహిళ కోరారు. పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రోజులు గడుస్తున్నా గానీ.. ఏపీలో ఈ విషయంపై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి