iDreamPost

నేను ప్రేమించిన అమ్మాయి ఆ హీరోతో.. అందుకే ఇలా పగ తీర్చుకున్న..

నేను ప్రేమించిన అమ్మాయి ఆ హీరోతో.. అందుకే ఇలా పగ తీర్చుకున్న..

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఓ సమయంలో ప్రేమలో పడడం సహజం. అది వన్ సైడ్ లవ్ అయినా కావొచ్చు లేదా టూ సైడ్ లవ్ అయినా కావొచ్చు. కానీ లవ్ లో అందరు సక్సెస్ అయి తాము కోరుకున్న వ్యక్తిని పొందగలరా అంటే ఖచ్చితంగా చెప్పలేము. దానికి గల కారణాలు అనేకం. కానీ ప్రేమించిన వ్యక్తి దూరమైతే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఇదే అంశానికి చెందిన విషయంలో సినీ నటుడు విజయ్ సేతుపతి తన జీవితంలో జరిగిన సంఘటనను అభిమానులతో పంచుకున్నారు. తాను ఓ యువతిని ప్రేమించానని, కానీ ఆ యువతి మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు చెప్పిందంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఆ కారణం చేత వారిపై పగ తీర్చుకున్నానంటూ బాంబ్ పేల్చాడు. అసలు ఏం జరిగిందంటే?

హీరో షారుఖ్ ఖాన్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ జవాన్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో నయనతార కథానాయకిగా నటించగా విజయ్‌ సేతుపతి, ప్రియమణి ముఖ్య పాత్రలు పోషించగా నటి దీపికా పడుకొనే అతిథి పాత్రలో నటించింది. భారీ అంచనాలతో ఈ నెల 7న థియేటర్లలో సందడి చేయనుంది. దీనిలో భాగంగా జవాన్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ని చైన్నెలో నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ వేడుకలో నటుడు విజయ్ సేతుపతి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. షారుఖ్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపాడు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. అదేంటంటే?

తాను స్కూల్ లో చదువుతున్న సమయంలో ఓ అమ్మాయిని ప్రేమించానని, కానీ ఆ అమ్మాయి మాత్రం తనను ప్రేమించలేదని విజయ్ సేతుపతి లిపాడు. పైగా తనకు షారుఖ్ ఖాన్ అంటే అమితమైన ఇష్టమని అతడిని ప్రేమిస్తున్నట్లు చెప్పిందని విజయ్ సేతుపతి వెల్లడించాడు.అప్పట్నుంచి హీరో షారుఖ్ ఖాన్ పై పగ పెంచుకున్నానని, ఆ పగను జవాన్ సినిమా ద్వారా తీర్చుకున్నానని విజయ్ సేతుపతి తెలిపాడు. దీనిపై షారుఖ్ ఖాన్ మట్లాడుతూ.. విజయ్ సేతుపతి పగ తీర్చుకోలేడని ఎందుకంటే అతడు తన అభిమాని అని చెప్పడంతో ఫ్యాన్స్ అందరు ఫుల్ ఖుష్ అయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి