iDreamPost
android-app
ios-app

దారుణం: బైక్‌కు కట్టేసి.. యువకుడిని కిలోమీటర్ ఈడ్చుకెళ్లి..

దారుణం: బైక్‌కు కట్టేసి.. యువకుడిని కిలోమీటర్ ఈడ్చుకెళ్లి..

సమాజంలో అనేక రకాల నేర ఘటనలు జరుగుతుంటాయి. అయితే కొన్ని దారుణాలు చూసినప్పుడు అసలు వీళ్లు మనుషులేనా? లేకా మనుషుల రూపంలో  ఉన్న రాక్షసులా? అనే సందేహం రాక మానదు. ఇటీవలే రీల్స్ చేస్తుందని చెల్లెల్ని అత్యంత దారుణంగా ఇనుప రాడ్డుతో ఒక వ్యక్తి కొట్టి చంపాడు. అలానే మూగ జీవాలను తాళ్లతో కట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘోరమైన ఘటనలను మనం చూశాం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో కూడా అత్యంత దారుణమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని తాడుతో బైక్ కట్టి  కిలోమీటర్ మేరకు ఈడ్చుకుంటూ వెళ్లారు కొందరు యువకులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీలో ఈ అమానుష ఘటన జరిగింది. ఈ వీడియోను చూసినట్లయితే.. ఇందులో స్కూటీపై వెళ్తున్న ముగ్గురు యువకులు .. ఓ వ్యక్తిని తాడుతో కట్టి లాక్కెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. పట్టపగలే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఈ దారుణం జరగింది. అయితే ఎవరు వారిని అడ్డగించే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ ఘటనలో  బాధితుడికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అయితే ఆ దుండగులు ఇంత క్రూరంగా ఎందుకు ప్రవర్తించారనేది తెలియరాలేదు. ఈ ఘటన జూలై 25న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.

అలానే ఈ వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అయి.. చివరకు పోలీసులకు చేరింది. దీంతో రంగలోకి దిగిన పోలీసులు  ఈఘటన బరాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో ని సంజయ్ నగర్ లో జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుని శిక్షపడేలా చేస్తామని పోలీసులు  అన్నారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైర్  అవుతున్నారు. ఇలా పట్టపగలే జరుగుతుంటే స్థానిక పోలీసులు ఏం  చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే సామాన్యులు ఎలా బతకాలి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు ఎలాంటి శిక్ష పడాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ప్రియుడి మోజులో.. భర్తను ముక్కలుగా నరికి చంపిన భార్య!

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibombetcio girişiptv satın alCasibom