iDreamPost
android-app
ios-app

జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ .. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో ఏర్పాట్లు

  • Published May 21, 2024 | 10:56 AM Updated Updated May 21, 2024 | 10:56 AM

దశాబ్ద కాలంగా చేప ప్రసాదంను బత్తుల ఫ్యామిలీ హైదరాబాద్‌ లో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చేప ప్రసాదం అనేది ప్రతిఏటా మృగశిర కార్తె రోజున పంపిణీ చేస్తారు. కాగా, ఈ ఏడాది వచ్చేనెల ఆ తేదీన నాంపల్లిలో పంపిణీ చేయనున్నారు.

దశాబ్ద కాలంగా చేప ప్రసాదంను బత్తుల ఫ్యామిలీ హైదరాబాద్‌ లో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చేప ప్రసాదం అనేది ప్రతిఏటా మృగశిర కార్తె రోజున పంపిణీ చేస్తారు. కాగా, ఈ ఏడాది వచ్చేనెల ఆ తేదీన నాంపల్లిలో పంపిణీ చేయనున్నారు.

  • Published May 21, 2024 | 10:56 AMUpdated May 21, 2024 | 10:56 AM
జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ .. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో ఏర్పాట్లు

చేప ప్రసాదం.. ఈ ప్రసాదం గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్‌లో ఈ చేప ప్రసాదం తంతు కొనసాగుతునే ఉంది. అంతేకాకుండా.. ప్రతిఏటా ఈ ప్రసాదం గురించి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపాతండోలుగా తరలి వెళ్తుంటారు. అయితే ప్రతిఏటా ఈ ప్రసాదాన్ని మృగశిర కార్తె రోజున బత్తిలి కుటంబం ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంటారు. కాగా, ఈ సంవత్సరం వచ్చే నెల అనగా జూన్‌ 8వ తేదీన ఉదయం 11 గంటలకు మృగశిర కార్తె ప్రవేశిస్తుంది. అయితే అదే రోజున ఈ చేప ప్రసాదం పంపిణీ ప్రాంభించానున్నారు.

ఇక ఆ పంపిణీ అనేది మరుసటి రోజు ఆదివారం ఉదయం 11 గంటల వరకు 24 గంటల వరకు చేస్తామని బత్తిని మృగశిర ట్రస్టు నిర్వాహకులు, దివంగత బత్తిని హరినాథ్‌ కొడుకు అమర్నాథ్​ గౌడ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. అయితే ఈసారి 3 లక్షల చేప పిల్లలకు ఆర్డర్​ ఇచ్చామని, వెజిటేరియన్లకు బెల్లంతో ప్రసాదం ఇస్తామని చెప్పారు. ఇకపోతే సుమారుగా ఈ చేప పంపిణీ 179 సంవత్సరాలుగా జరుగుతోందని, పైగా ఎవరు ఎక్కడా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈసారి నాంపల్లిలో ఈ ప్రసాదం  మొదటగా పంపిణీ చేసి, ఆ తర్వాత.. దూద్​ బౌలిలో మూడు రోజులపాటు పంపిణీ ఉంటుందన్నారు. అంతేకాకుండా.. వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్​చైర్స్​తోపాటు అంబులెన్స్​ సౌకర్యం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

అయితే ఈ చేప ప్రసాదం అనేది ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాశ సంబంధ వ్యాధుల నివారణ అనే విషయం తెలిసిందే. అందుకే ప్రతిఏటా దీనిని మృగశిర కార్తె ప్రవేశించిన ఘడియల్లో  ఓ పదార్థాన్ని చేప ద్వారా నోటిలో వేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే ఈ చేప ప్రసాదం పంపిణీ విషయంలో గత ప్రభుత్వాలు పూర్తిగా సహకరించాయని, అలాగే ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డితో పాటు వారి మంత్రివర్గ సభ్యులను కలిసి ఈ చేప ప్రసాదం పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కోరుతామని అమర్నాథ్​ గౌడ్ తెలిపారు.

కాగా, ఎప్పటిలాగే జీహెచ్​ఎంసీ, ఆర్టీసీ, వాటర్​ వర్క్స్ డిపార్ట్​మెంట్లతో పాటు పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. ఇక ప ప్రసాదం కోసం వచ్చేవారికి భోజనం, టీ, కాఫీ, మజ్టిగ, మంచినీళ్లను స్వచ్ఛంద సంస్థలు సమకూరుస్తాయని ఆయన చెప్పారు. అయితే ఈ సమావేశంలో బత్తిని కుటుంబ సభ్యులు గౌరీశంకర్​ గౌడ్, శివశంకర్​ గౌడ్, సంతోష్​ గౌడ్, కైలాశ్​ కేడియా తదితరులు పాల్గొన్నారు.