హైదరాబాద్ లో ఈ ప్రాంతాల్లోని రెండ్రోజులు నీటి సరఫరా అంతరాయం!

నీరే జీవనాధారం అంటారు. అయితే ఒక్క తాగునీరు మాత్రమే కాదు. నీరు లేనిదే జనజీవనం స్తంభించి పోతుంది. జీవితంలో నీరు లేకుండా ఒక క్షణం కూడా ఊహించుకోలేం. అలాంటిది నగరంలో రెండ్రోజులు నీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించగానే నగరవాసులు కంగారు పడుతున్నారు. అయితే నగరంలోని అన్నీ ప్రాంతాలకు అంతరాయం ఉండదు. దాదాపు 30 ప్రాంతాల్లో మాత్రమే పాక్షికంగా లేదంటే పూర్తిస్థాయిలో మంజీరా నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు అలర్ట్ చేశారు. ఈ నెల 19న ఉదయం నుంచి 20 తేదీ మధ్యాహ్నం వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించారు. హైదరాబాద్ మహా నగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లయ్ ఫేజ్-2లో కలబ్ గూర్ నుంచి పటాన్ చెరు వరకు పైప్ లైన్ కు జంక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరంలో పలు ప్రాంతాల్లో మంజీరా నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. జలమండలి సూచించిన ప్రాంతాల ప్రజలు మంజీరా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

ఈ ప్రాంతాల్లోనే అంతరాయం:

  • ఓఅండ్ఎం డివిజన్ 6: ఎస్సార్ నగర్, అమీర్ పేట్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో పాక్షికంగా అంతరాయం.
  • ఓఅండ్ఎం డివిజన్ 8: ఈ డివిజన్ లో బల్క్ కెనెక్షన్లు, ఆఫ్ టేక్ పాయింట్లకు అంతరాయం.
  • ఓఅండ్ఎం డివిజన్ 9: కేపీహెచ్ బీ కాలనీ, మూసాపేట్, జగద్గిరిగుట్ట, కూకట్ పల్లి ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకి అంతరాయం
  • ఓఅండ్ఎం డివిజన్ 15: అశోక్ నగర్, జ్యోతీనగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, దీప్తి శ్రీనగర్, మదీనాగూడ, మియాపూర్, ఆర్సీపురం ప్రాంతాల్లో నీటి సరఫరాకి అంతరాయం.
  • ఓఅండ్ఎం డివిజన్ 24: అమీన్ పూర్, బీరంగూడ ప్రాంతాల్లో నీటి సరఫరాకి అంతరాయం.
Show comments