భార్యతో గొడవ పడి కరెంట్ స్తంభం ఎక్కిన భర్త! అంతే కాదండోయ్..!

భార్యతో గొడవ పడి కరెంట్ స్తంభం ఎక్కిన భర్త! అంతే కాదండోయ్..!

భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం సహజం. ఇంత దానికే కొందరు దంపతులు కొట్టుకోవడం, చివరికి హత్యలు, ఆత్మహత్యలకు కూడా వెనకాడడం లేదు. కానీ, ఆదిలాబాద్ కు చెందని ఓ వ్యక్తి మాత్రం భార్యతో గొడవ పడి ఏకంగా కరెంట్ స్తంభం ఎక్కాడు. అంతే కాదండోయ్ ఏకంగా మనోడు అక్కడి నుంచి సినిమా స్టైల్ లో హీరోలా కిందకు దూకాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే?

స్థానికుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రాంతంలో దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక భార్యపై కోపంతో భర్త స్థానికంగా ఉన్న ఓ కరెంట్ స్తంభాన్ని ఎక్కాడు. కొద్ది సేపు అక్కడే నిలబడి భార్యను బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో అందరూ అప్రమత్తమై అతడిని కిందకు దించే పనిలో ఉండగానే.. అదుపు తప్పి అతడు అక్కడి నుంచి కింద పడ్డాడు. తీవ్రగాయాల పాలైన ఆ వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భార్యపై కోపంతో కరెంట్ స్తంభాన్ని ఎక్కిన ఆతగాడి చర్యపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: భర్త బిజినెస్ మ్యాన్, భార్య పొలిటిషియన్.. అంతా బాగానే ఉన్నా..!

Show comments