iDreamPost
android-app
ios-app

మరికొన్ని రోజుల్లో వివాహం.. కాబోయే భర్త కలవడానికి వెళ్లి.. అసలు ఏం జరిగిందంటే?

  • Published Oct 07, 2024 | 11:05 AM Updated Updated Oct 07, 2024 | 11:05 AM

మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా అంతలోనే ఘోరం జరిగిపోయింది. కాబోయే భర్త ఆమెను కలవడానికి వెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మైసూర్ లో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే?

మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా అంతలోనే ఘోరం జరిగిపోయింది. కాబోయే భర్త ఆమెను కలవడానికి వెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మైసూర్ లో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే?

మరికొన్ని రోజుల్లో వివాహం.. కాబోయే భర్త కలవడానికి వెళ్లి.. అసలు ఏం జరిగిందంటే?

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. యువతీ యువకులు పెళ్లి కోసం ఎన్నో కలలుకంటుంటారు. తమ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటుంటారు. తమకు కాబోయే భర్త, లేదా భార్య ఇలా ఉండాలని మంచి సంబంధాల కోసం వెతుకుతుంటారు. కొందరు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటారు. మరికొందరు పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకుంటారు. నేటి రోజుల్లో వివాహం ఏదైనా సరే వైవాహిక జీవితంలో గొడవలు అనేవి కామన్ అయిపోయాయి. ఒకరినొకరు అర్ధం చేసుకోలేక, పెత్తనం చెలాయించడం, ఆర్థిక కారణాలు ఇలా భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతున్నాయి. భార్యా భర్తల మధ్య తలెత్తే చిన్న చిన్న గొడవలే పెను తుఫానుగా మారుతున్నాయి.

చివరకు క్షణికావేశంతో ప్రాణాలు కూడా తీస్తున్నారు. అయితే సాధారణంగా ఏ గొడవలైన పెళ్లి తర్వాతే చోటుచేసుకుంటాయి. అమ్మాయి లేదా అబ్బాయి ప్రవర్తన నచ్చలేదని, అందంగా లేరని వివాదాలు చోటుచేసుకుంటుంటాయి. కట్నం విషయంలో కూడా గొడవలు తలెత్తుతుంటాయి. ఒక్కోసారి అదనపు కట్నం తేవాలని భార్యను వేధించే భర్తలు కూడా ఉంటారు. ఇలాంటి కారణాలతో భార్యను కడతేర్చిన ఘటనలు ఎన్నో చూశాం. అయితే కొన్ని సందర్భాల్లో పెళ్లి కాక ముందే హత్యలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. మరికొన్ని రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఘోరం జరిగిపోయింది. కాబోయే భర్త ఆమెను కలవడానికి వెళ్లి దారుణానికి పాల్పడ్డాడు.

ఈ ఘటన మైసూర్ లో చోటుచేసుకుంది. జిల్లాలోని హెచ్‌.డి.కోటె తాలూకాలోని హిరేహళ్ళిలో ఈ దారుణం జరిగింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. పొరుగు గ్రామానికి చెందిన నిరంజన్‌ అనే యువకునితో పుట్టమల్లప్ప, శివనంజమ్మల కుమార్తె కవిత (20)కు ఈ నెల 21వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో మునిగిపోయారు. ఓ రోజు కవిత తల్లిదండ్రులు పొలానికి వెళ్లగా, ఆమెను కలవడానికి కాబోయే భర్త నిరంజన్‌ ఇంటికి వచ్చాడు. తలుపులు వేసుకుని ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అంతలోనే ఏం జరిగిందో ఏమో నిరంజన్‌ ఇంట్లోనుంచి బయటకు వచ్చి కవిత ఉరివేసుకుందని చెప్పాడు. కవిత ఆత్మహత్య చేసుకుందని ఇరుగుపొరుగుకి చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు.

వెంటనే స్థానికులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వచ్చి విగతజీవిగా పడి ఉన్న కూతురుని చూసి బోరున విలపించారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా కూతురు ప్రాణాలు పోవడంతో గుండెలవిసేలా విలపించారు. అయితే తమ కూతురిది ఆత్మహత్య కాదని, కాబోయే అల్లుడే హత్య చేశాడని కవిత తల్లిదండ్రులు ఆరోపించారు. ఆమె పేరెంట్స్ అంతరసంత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నిరంజన్‌ కోసం గాలిస్తుండగా అతడు వచ్చి లొంగిపోయాడు. పోలీసులు నిరంజన్ ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. పెళ్లి డప్పులు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో స్థానికులంతా కన్నీటిపర్యంతమయ్యారు. మరి కాబోయే భర్తే భార్యను హతమార్చిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.