iDreamPost
android-app
ios-app

హర్మన్ మెరుపు ఇన్నింగ్స్.. ముంబైకి వరుసగా రెండో విజయం!

  • Published Feb 26, 2024 | 8:55 AMUpdated Feb 26, 2024 | 9:06 AM

ముంబై ఇండియన్స్ జట్టు హవా నడుస్తోంది. వరుసగా రెండో విజయం సాధించిన ఆ టీమ్.. విమెన్స్ ప్రీమియర్ లీగ్​-2024లో ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపించింది.

ముంబై ఇండియన్స్ జట్టు హవా నడుస్తోంది. వరుసగా రెండో విజయం సాధించిన ఆ టీమ్.. విమెన్స్ ప్రీమియర్ లీగ్​-2024లో ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపించింది.

  • Published Feb 26, 2024 | 8:55 AMUpdated Feb 26, 2024 | 9:06 AM
హర్మన్ మెరుపు ఇన్నింగ్స్.. ముంబైకి వరుసగా రెండో విజయం!

విమెన్స్ ప్రీమియర్ లీగ్-2024లో ముంబై ఇండియన్స్ హవా నడుస్తోంది. ఆ జట్టు వరుసగా రెండో విక్టరీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ముంబై నయా సీజన్​ను అనుకున్నట్లే బాగా స్టార్ట్ చేసింది. తొలి మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్​ను చిత్తు చేసిన ముంబై.. రెండో మ్యాచ్​లో గుజరాత్ జియాంట్స్ మీద అలవోకగా నెగ్గింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన గుజరాత్ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు కేవలం 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ టీమ్​లో కెప్టెన్ బెత్ మూనీ (24), ఎమ్మా బ్రైస్ (25), తనూజా కన్వార్ (28) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన ముంబై 18.1 ఓవర్లలోనే టార్గెట్​ను ఉఫ్​మని ఊదిపారేసింది. ముంబై బ్యాటర్ల జోరు ముందు గుజరాత్ బౌలర్లు తేలిపోయారు. హర్మన్​ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నాక్​తో చెలరేగిపోయింది.

126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి సరైన స్టార్ట్ దొరకలేదు. యషికా భాటియా (7), హేలీ మాథ్యూస్ (7) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అయితే సారథి హర్మన్​ప్రీత్ (46 నాటౌట్) ఒక ఎండ్​లో పాతుకుపోయింది. సీవర్ బ్రంట్ (22), అమెలియా కెర్ (31) సాయంతో టీమ్​ను విజయతీరాలకు చేర్చింది. ఏ దశలోనూ స్ట్రయిక్ రేట్ పడిపోకుండా చూస్తూ గుజరాత్ బౌలర్లను డిఫెన్స్​లో పడేసింది. స్ట్రయిక్ రొటేషన్ చేస్తూనే చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించింది ముంబై సారథి. ఒకవేళ హర్మన్ గనుక ఔట్ అయి ఉంటే ముంబైకి ఛేజ్ చేయడం కష్టమయ్యేది. కానీ తను మాత్రం ఒక ఎండ్​లో చకచకా పరుగులు చేస్తూ మిగతా బ్యాటర్ల మీద ఏమాత్రం ప్రెజర్ రాకుండా చూసుకుంది. ఆఖర్లో సిక్స్ కొట్టి మ్యాచ్​ను ఫినిష్ చేసింది. తను బ్యాటింగ్​తో పాటు ఫీల్డింగ్ టైమ్​లో సరైన టైమ్​లో సరైన డిసిషన్స్ తీసుకుంటూ కెప్టెన్​గానూ ఆకట్టుకుంది.

గుజరాత్ బౌలర్లలో తనూజా కన్వార్ 2 వికెట్లు తీసింది. కాథరిన్ బ్రైస్, లీ తాహుహుకు చెరో వికెట్ దక్కింది. బౌలింగ్​లో ఫర్వాలేదనిపించినా.. బ్యాటింగ్​లో ఫెయిలవడమే జియాంట్స్ కొంప ముంచింది. ఆ జట్టు బ్యాటర్లలో కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్క్​ను అందుకోలేకపోయారు. బెత్ మూనీకి మంచి స్టార్ట్ దొరికినా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయింది. ఆఖర్లో కాథరిన్, తనూజా కన్వార్ పోరాడకపోయి ఉంటే ఆ మాత్రం టార్గెట్​ను కూడా సెట్ చేసి ఉండేది కాదు. ముంబై బౌలర్లలో అమెలియా కెర్ (4/17), షబ్నిమ్ ఇస్మాయిల్ (3/18) అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. వాళ్ల దెబ్బకు గుజరాత్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. వీళ్లిద్దరికీ తోడు నాట్ బ్రంట్, హేలీ మాథ్యూస్ చెరో వికెట్​తో మంచి సపోర్ట్ అందించారు. ఈ విజయంతో ముంబై లీగ్​లో ఫుల్ జోష్​లో కనిపిస్తోంది. మరి.. డబ్ల్యూపీఎల్​లో ముంబై వరుసగా రెండో విక్టరీ కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: RCB ప్లేయర్స్​కు మాత్రమే దక్కే క్రేజ్ ఇది.. వైరల్ వీడియో!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి