iDreamPost
android-app
ios-app

కోహ్లి, సచిన్, ధోని కాదు.. వరల్డ్​లో రిచెస్ట్ క్రికెటర్ ఈయనే..!

  • Author singhj Published - 12:27 PM, Fri - 7 July 23
  • Author singhj Published - 12:27 PM, Fri - 7 July 23
కోహ్లి, సచిన్, ధోని కాదు.. వరల్డ్​లో రిచెస్ట్ క్రికెటర్ ఈయనే..!

క్రికెట్ ఇప్పుడు కాసుల క్రీడగా మారిపోయింది. ఈ గేమ్​ను బంగారు గుడ్లు పెట్టే బాతులా అందరూ చూస్తున్నారు. లీగ్​ల పుణ్యమా అని క్రికెట్​లో డబ్బుల వర్షం కురుస్తోంది. యాడ్స్, స్ట్రీమింగ్ రైట్స్, స్పాన్సర్​షిప్స్ రూపంలో బోర్డులతో పాటు ప్లేయర్లు బాగా సంపాదిస్తున్నారు. ఆటగాళ్ల నికర సంపద ఏటేటా అంతకంతకూ పెరుగుతూ పోతోంది. జాతీయ జట్టుకు ఆడితే వచ్చే డబ్బుల కంటే లీగ్స్, యాడ్స్ ద్వారా వచ్చే రెవెన్యూనే అధికంగా ఉంటోంది. అందుకే పలు దేశాల క్రికెటర్లు లీగ్స్​పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తమ సంపాదనను రెట్టింపు చేసుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుత క్రికెట్​లో ధనార్జనలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూసుకెళ్తున్నాడు. అతడి నికర సంపద ఇటీవలే రూ.1,000 కోట్లు దాటిన సంగతి తెలిసిందే.

ఏ ప్లస్ గ్రేడ్ కాంట్రాక్ట్ కలిగిన విరాట్​ కోహ్లీకి బీసీసీఐ నుంచి ఏటా రూ.7 కోట్లు అందుతాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఆర్సీబీ నుంచి అతడికి ఏటా రూ.15 కోట్లు వేతనంగా అందుతోంది. వీటితో పాటు యాడ్స్, బిజినెస్ ద్వారా కోహ్లి భారీ మొత్తంలో ఆర్జిస్తున్నాడు. విరాట్ తర్వాత చూసుకుంటే.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంపాదనలో తానేమీ తక్కువ కాదంటున్నాడు. ఈ బ్యాటింగ్ లెజెండ్ జెంటిల్మన్ గేమ్​కు వీడ్కోలు చెప్పి చాలా కాలమే అయింది. కానీ ఆర్జనలో మాత్రం ఇప్పటికీ ముందున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ నికర సంపద రూ.1,250 కోట్లుగా ఉంది. ఆ తర్వాత చూసుకుంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. మాహీ నికర సంపద రూ.1,040 కోట్లుగా ఉంది.

కోహ్లి, సచిన్, ధోనీలను ప్రపంచ క్రికెట్​లో అత్యంత సంపన్న క్రికెటర్లుగా అందరూ భావిస్తారు. కానీ వరల్డ్ క్రికెట్​లో అత్యంత సంపన్నుడు మరొకరు ఉన్నారు. ఆ ప్లేయరే సమర్​జిత్​సిన్హ్ రంజిత్ సిన్హ్​ గైక్వాడ్. 1967వ సంవత్సరం ఏప్రిల్ 25న పుట్టిన ఈయన.. ఫస్ట్​క్లాస్​ క్రికెటర్​గా గుర్తింపు పొందారు. ఈయన బరోడా రాజు కావడం విశేషం. వారసత్వంగానే రంజిత్​సిన్హ్​కు రూ.20 వేల కోట్ల సంపద సంక్రమించింది. వరల్డ్​లోని అతిపెద్ద ప్రైవేట్ నివాసమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్ యజమాని ఈయనే కావడం గమనార్హం. గుజరాత్​తో పాటు వారణాసిలోని 17 ఆలయాలను నడిపే ట్రస్టుల బాధ్యతలను ఈయనే చూసుకుంటున్నారు. రంజీ ట్రోఫీలో బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు రంజిత్​సిన్హ్​. సచిన్, కోహ్లి, ధోని లాంటి వాళ్లు క్రికెట్ ఆడటం ద్వారా డబ్బులు సంపాదిస్తే.. ఈయనకు మాత్రం వారసత్వంగానే వేల కోట్ల ఆస్తులు సంక్రమించాయి.