నాకౌట్​లో న్యూజిలాండ్​తో ఫైట్​.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సెహ్వాగ్!

  • Author singhj Published - 10:38 AM, Fri - 10 November 23

సెమీఫైనల్​లో టీమిండియా-న్యూజిలాండ్ తలపడటం దాదాపుగా ఖాయమైంది. ఈ నేపథ్యంలో భారత లెజెండరీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సెమీఫైనల్​లో టీమిండియా-న్యూజిలాండ్ తలపడటం దాదాపుగా ఖాయమైంది. ఈ నేపథ్యంలో భారత లెజెండరీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

  • Author singhj Published - 10:38 AM, Fri - 10 November 23

వన్డే వరల్డ్ కప్-2023 కీలక దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్​లు ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో అందరూ నాకౌట్ మ్యాచుల మీద దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే సెమీఫైనల్ చేరుకునే టీమ్స్ మీద దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య ఓ సెమీస్ కన్ఫర్మ్ అయిపోయింది. మరో సెమీఫైనల్​లో టీమిండియాతో న్యూజిలాండ్ ఆడటం దాదాపుగా ఖాయమైందనే చెప్పాలి. పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ నాకౌట్ మ్యాచ్​లకు క్వాలిఫై అవ్వడం అసాధ్యమనే చెప్పాలి. టెక్నికల్​గా ప్రకటించకపోయినా విలియమ్సన్ టీమ్ సెమీస్ బెర్తు సొంతం చేసుకుందని చెప్పొచ్చు. ఫైనల్​లో చోటు కోసం ఈ నెల 15వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్​లో భారత్​ను ఢీకొనాల్సి ఉంటుంది కివీస్.

మెగా టోర్నీలో వరుసగా నాలుగు విజయాలతో దుమ్మురేపిన కివీస్.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలైంది. కానీ సెమీస్ చేరాలంటే కీలకంగా మారిన మ్యాచ్​లో కెప్టెన్ కేన్ విలియమ్సన్, లాకీ ఫెర్గూసన్ టీమ్​లో చేరడంతో అనుకున్నది సాధించింది. టెక్నికల్​గా ప్రకటించికపోయినా భారత సెమీస్ ప్రత్యర్థి న్యూజిలాండ్ అని తేలిపోయింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్​కు ఒక భయం పట్టుకుంది. వరల్డ్ కప్స్​లో కివీస్​పై మనకు గొప్ప రికార్డు లేదు. 2019 ప్రపంచ కప్​ సెమీస్​లో ఆ టీమ్ చేతుల్లోనే భారత్ ఓడిపోయింది. ఫైనల్ చేరాలంటే నెగ్గి తీరాల్సిన ఆ మ్యాచ్​లో 239 రన్స్ ఛేజింగ్​కు దిగిన టీమిండియా 221 రన్స్​కు ఆలౌటైంది. దీంతో మళ్లీ అదే రిపీట్ అవుతుందేమోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. కివీస్ తప్ప ఏ టీమ్​తో ఆడాల్సి వచ్చినా ఈ ఆందోళన ఉండేది కాదంటున్నారు.

వన్డే వరల్డ్ కప్స్​లో ఇప్పటిదాకా భారత్-న్యూజిలాండ్​లు 10 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా నాలుగు సార్లు గెలవగా.. కివీస్​ ఐదు సార్లు నెగ్గింది. ఒక మ్యాచ్​లో రిజల్ట్ రాలేదు. 2003 వరల్డ్ కప్ తర్వాత నుంచి మన టీమ్​పై మెగా టోర్నీలో కివీస్ డామినేషన్ చూపిస్తోంది. అయితే ఈ వరల్డ్ కప్​లో మాత్రం సిచ్యువేషన్ వేరేగా ఉంది. రోహిత్ సేన ఆడిన 8 మ్యాచుల్లోనూ నెగ్గింది. లీగ్ దశలో న్యూజిలాండ్​తో ఆడిన మ్యాచులోనూ విజయం సాధించింది. సొంత గడ్డపై ఆడుతుండటం, ఫ్యాన్స్ సపోర్ట్, పిచ్ కండీషన్స్ తెలియడం, సూపర్ ఫామ్​లో ఉండటంతో నాకౌట్​ పోరులోనూ కివీస్​ను భారత్ చిత్తు చేస్తుందని క్రికెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై లెజెండరీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ రియాక్ట్ అయ్యాడు. మళ్లీ ఆ దరిద్రమేనా అంటూ తనదైన శైలిలో స్పందించాడు సెహ్వాగ్. అయినా సరే కివీస్​కు గట్టిగా ఇచ్చి పడేయాలన్నాడు. ప్రత్యర్థి ఎవరనేది కాదు.. కప్పే ముఖ్యమన్నాడు వీరూ. మరి.. సెహ్వాగ్ వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కోహ్లీపై ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ ఘాటు విమర్శలు.. అతడో ఇడియట్ అంటూ..!

Show comments