ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ కప్ ఫైనల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాదు.. మరో ప్లేయర్ భారత్కు కీలకం అవుతాడని గంభీర్ అన్నాడు. అతడు ఆసీస్ బౌలర్లను చితగ్గొడతాడని చెప్పాడు.
ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ కప్ ఫైనల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాదు.. మరో ప్లేయర్ భారత్కు కీలకం అవుతాడని గంభీర్ అన్నాడు. అతడు ఆసీస్ బౌలర్లను చితగ్గొడతాడని చెప్పాడు.
అద్భుతంగా ఆడుతూ వరల్డ్ కప్ ఫైనల్కు చేరుకుంది టీమిండియా. లీగ్ స్టేజ్లో వరుసగా 9 విజయాలు సాధించడం ఒకెత్తయితే.. నాకౌట్లో న్యూజిలాండ్ను చిత్తు చేయడం మరొకెత్తనే చెప్పాలి. సెమీఫైనల్ మ్యాచ్లో కేన్ విలియమ్సన్-డారిల్ మిచెల్ బ్యాటింగ్ చేస్తున్న టైమ్లో తప్పితే మిగతా మొత్తం రోహిత్ సేన డామినేషనే నడిచింది. భారత్ గ్రౌండ్లోకి దిగితే చాలు.. ప్రత్యర్థి టీమ్స్ ఎలా ఆడాలో తెలియక భయపడిపోతున్నాయి. అన్ని విభాగాల్లో ఫుల్ స్ట్రాంగ్గా, సూపర్ ఫామ్లో ఉన్న టీమిండియాను ఫేస్ చేయాలంటేనే గజగజా వణికిపోతున్నాయి. అయితే ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక ఫైనల్లో మరో లెక్క అనే చెప్పాలి. ఎందుకుంటే అవతల ఉన్నది డేంజరస్ టీమ్ ఆస్ట్రేలియా. వరల్డ్ కప్స్లో ఆ జట్టుకు ఉన్నంత గొప్ప రికార్డు మరే టీమ్కు లేదు.
ఈ వరల్డ్ కప్లో ఆసీస్ టీమ్ ఫైనల్కు చేరుకున్న తీరు చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. ఆ జట్టుకు విజయాలు కొత్త కాదు. కప్పులు అసలే కొత్త కాదు. ఎప్పుడు ప్రపంచకప్ జరిగినా కంగారూ టీమ్ మినిమం సెమీస్కు చేరుకుంటుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పొరపాటున ఆసీస్ గనుక ఫైనల్కు వచ్చిందా అవతలి జట్టు కప్పుపై ఆశలు వదులుకోవాల్సిందే. ఈ ఏడాది కూడా ఫేవరెట్స్లో ఒకటిగా మెగాటోర్నీకి వచ్చింది కమిన్స్ సేన. కానీ ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనూ ఓటమే. పాయింట్స్ టేబుల్లో అందరికంటే లాస్ట్ ప్లేస్. అయితే అద్భుతంగా పుంజుకున్న కంగారూ జట్టు వరుసగా ఎనిమిది మ్యాచ్లు నెగ్గి ఫైనల్స్కు దూసుకెళ్లింది. టీమిండియాతో తాడోపేడో తేల్చుకునేందుకు సై అంటోంది. ప్రత్యర్థులు ఎంత కలవరపెట్టినా లొంగని ఈ టీమ్ను దాటుకొని ట్రోఫీని చేతబట్టడం ఇప్పుడు రోహిత్ సేన ముందున్న టార్గెట్. ఆసీస్తో ఫైనల్ ఫైట్కు భారత టీమ్ రెడీగా ఉంది.
సూపర్ ఫామ్లో ఉన్న భారత బ్యాటింగ్ ఆర్డర్ కంగారూ బౌలింగ్ అటాక్ను చిత్తు చేయాలని అనుకుంటోంది. విరాట్ కోహ్లీ (711 రన్స్), రోహిత్ శర్మ (550), శ్రేయస్ అయ్యర్ (526), కేఎల్ రాహుల్ (386), శుబ్మన్ గిల్ (346) భీకర ఫామ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఎవరు హీరో అవుతారో చూడాలి. అయితే ఫైనల్ మ్యాచ్లో కోహ్లీ, రోహిత్ కాదు.. టీమిండియాకు అయ్యర్ చాలా కీలకమని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. అతడు ఆసీస్ బౌలర్లను చితగ్గొడతాడని అన్నాడు. ‘ఈ వరల్డ్ కప్లో శ్రేయస్ అయ్యర్ బిగ్గెస్ట్ గేమ్ ఛేంజర్గా మారాడు. గాయం బారిన పడి, టీమ్లో ప్లేస్ కోసం ఫైట్ చేయాల్సిన పరిస్థితి నుంచి.. నాకౌట్ మ్యాచ్లో 70 బంతుల్లో సెంచరీ చేయడమంటే మాటలు కాదు. ఫైనల్లో మిడిల్ ఓవర్లలో మ్యాక్స్వెల్, జంపా బౌలింగ్ టైమ్లో భారత్కు అతడే కీలకం కానున్నాడు’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. మరి.. అయ్యర్పై గౌతీ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇండియా- ఆసీస్ ఫైనల్ మ్యాచ్.. పిచ్ పై స్టార్క్ ఆసక్తికర కామెంట్స్!
Gautam Gambhir said, “Shreyas Iyer is the biggest game changer for me in this World Cup. He was injured, had to fight for his place, and to score a century in 70 balls in the knockout is simply outstanding. He’ll be the key for India in the Final when Maxwell and Zampa bowls”. pic.twitter.com/lwO434RAlk
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2023