iDreamPost
android-app
ios-app

టీమిండియా కప్ గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తానంటున్న CEO

  • Author singhj Published - 07:48 PM, Sat - 18 November 23

వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఓడిస్తే ఏకంగా రూ.100 కోట్లు ఇస్తానని ఒక కంపెనీ సీఈవో ప్రామిస్ చేశారు. టీమిండియా కప్పు కొడితే తమ కస్టమర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానన్నారు.

వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఓడిస్తే ఏకంగా రూ.100 కోట్లు ఇస్తానని ఒక కంపెనీ సీఈవో ప్రామిస్ చేశారు. టీమిండియా కప్పు కొడితే తమ కస్టమర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానన్నారు.

  • Author singhj Published - 07:48 PM, Sat - 18 November 23
టీమిండియా కప్ గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తానంటున్న CEO

సొంతగడ్డ మీద జరుగుతున్న వరల్డ్ కప్​లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్​తో అజేయ రికార్డు కంటిన్యూ చేస్తూ ఫైనల్​కు చేరుకుంది టీమిండియా. ఆదివారం టైటిల్ కోసం ఆస్ట్రేలియాతో తుదిపోరులో తలపడనుంది. ఈ నేపథ్యంలో అందరి ఫోకస్ ఇప్పుడు అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ స్టేడియంపై పడింది. దునియాలోనే అతిపెద్దదైన ఈ క్రికెట్ స్టేడియంలో 1.32 లక్షల మంది ప్రేక్షకులు మ్యాచ్ చూసే ఛాన్స్ ఉంది. 1982లో నిర్మించిన సర్దార్ పటేల్ స్టేడియం మొతేరా స్టేడియంగా ప్రసిద్ధికెక్కింది. అయితే పాత స్టేడియం ప్లేసులోనే కొత్త దాని కన్​స్ట్రక్షన్ 2015లో మొదలుపెట్టారు.

వరల్డ్​లోనే అతి పెద్దదిగా మారిన మొతేరా స్టేడియాన్ని 2021లో మళ్లీ ప్రారంభించారు. ఈ గ్రౌండ్​లో మొత్తం 11 పిచ్​లు ఉన్నాయి. ఈ మైదానంలో భారత్​కు ఎన్నో అరుదైన రికార్డులు ఉన్నాయి. లెజెండ్ సునీల్ గవాస్కర్ 10 వేల రన్స్ మైల్​స్టోన్​ను చేరుకుంది ఇక్కడే. మొతేరా స్టేడియంలో కపిల్​దేవ్​కు కూడా గుర్తుండిపోయే మూమెంట్స్ ఉన్నాయి. ఈ గ్రౌండ్​లో కపిల్ 432వ వికెట్ తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మైదానంలో 1987, 1996 వరల్డ్ కప్స్​లో ఒక్కో మ్యాచ్ కూడా జరిగింది. 2011 ప్రపంచ కప్​లో 3 మ్యాచ్​లకు ఈ గ్రౌండ్ హోస్ట్​గా ఉంది. వన్డే క్రికెట్​లో 18 వేల రన్స్ చేసిన తొలి క్రికెటర్​గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చరిత్ర సృష్టించిందీ ఇక్కడే. టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ ఫస్ట్ డబుల్ సెంచరీని మొతేరాలోనే సాధించాడు. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్​లో 20 ఏళ్ల కెరీర్​ను, 30 వేల రన్స్​ను ఇక్కడే కంప్లీట్ చేసుకున్నాడు.

మొతేరా స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచుల్లో టీమిండియా ఇప్పటిదాకా ఓడిపోలేదు. 1987లో జింబాబ్వే మీద 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 2011 ప్రపంచ కప్ క్వార్టర్స్​లో ఆస్ట్రేలియాను 5 వికెట్లు తేడాతో ఇక్కడే చిత్తు చేసింది భారత్. ఇప్పుడూ అదే జోరును కంటిన్యూ చేస్తూ ఆసీస్​ను ఓడించాలని చూస్తోంది. ఓవరాల్​గా మొతేరా గ్రౌండ్​లో ఇప్పటిదాకా 18 మ్యాచులు ఆడిన భారత్.. పదింట్లో నెగ్గి, ఎనిమిది మ్యాచుల్లో ఓడిపోయింది. ఇక, భారత్​లో క్రికెట్ ఫీవర్ పీక్స్​లో ఉంది. మన జట్టు ఫైనల్​కు చేరుకోవడంతో ఫ్యాన్స్ పలు ప్రోగ్రామ్స్ మొదలుపెట్టారు. తిరంగాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ కంపెనీ సీఈవో తమ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించారు.

వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్​పై భారత్ నెగ్గితే రూ.100 కోట్లు ఇస్తానని ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా సంచలన ప్రకటన చేశారు. ఆఖరిసారిగా 2011లో టీమిండియా వరల్డ్ కప్ నెగ్గినప్పుడు తాను కాలేజీలో చదువుకుంటున్నానని తెలిపారు. తన లైఫ్​లో అత్యంత సంతోషకర క్షణాల్లో అదొకటని.. మ్యాచ్ గెలిచిన తర్వాత గూస్​బంప్స్ కలిగాయన్నారు. ఇవాళ తన ఫైనాన్స్ టీమ్​తో మాట్లాడానని.. ఇండియా కప్పు కొడితే తమ కస్టమర్ల వ్యాలెట్లలో రూ.100 కోట్లు వేస్తానని పునీత్ హామీ ఇచ్చారు. మన టీమ్ గెలుపు కోసం ప్రార్థిద్దామంటూ లింక్డ్​ఇన్​లో ఆయన పెట్టిన పోస్టు వైరల్​గా మారింది. మరి.. భారత్ కప్పు కొడితే రూ.100 కోట్లు ఇస్తానంటూ సీఈవో పునీత్ చేసిన ప్రకటనపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రాసిపెట్టుకోండి.. వాళ్లిద్దరూ చెలరేగితే వరల్డ్‌ కప్‌ మనదే!

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio