భారత టీమ్ భవిష్యత్తుకు ఢోకా లేదని ఒక యంగ్ ప్లేయర్ భరోసా ఇస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని మించి ఆడుతూ తానున్నాను డోంట్ వర్రీ అంటున్నాడు.
భారత టీమ్ భవిష్యత్తుకు ఢోకా లేదని ఒక యంగ్ ప్లేయర్ భరోసా ఇస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని మించి ఆడుతూ తానున్నాను డోంట్ వర్రీ అంటున్నాడు.
భారత క్రికెట్ టీమ్ ముందెన్నడూ లేనంత ఫామ్లో ఉంది. వరుసగా ఆసియా కప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లు గెలుచుకున్న రోహిత్ సేన.. వన్డే వరల్డ్ కప్-2023లో తన డామినేషన్ చూపిస్తోంది. ఇప్పటిదాకా మెగా టోర్నీలో ఆడిన ఏడుకు ఏడు మ్యాచుల్లోనూ నెగ్గింది. భారత్తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి జట్లు భయపడుతున్నాయి. ఒకప్పుడు క్రికెట్పై ఆస్ట్రేలియా జట్టు ఎలా ఆధిపత్యం చూపించిందో అదే స్థాయిలో ఇప్పుడు టీమిండియా డామినేషన్ నడుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏ విభాగంలోనూ రోహిత్ సేనను ఆపడం ఎవరి తరం కావడం లేదు. ఇదే ఊపును కంటిన్యూ చేస్తే భారత్ ఒడిలో మూడో ప్రపంచ కప్ వచ్చి చేరడం ఖాయమనే చెప్పాలి.
వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా విజయాల్లో జట్టులోని అందరి పాత్ర ఎంతో కీలకం. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మాత్రం ఎక్కువ క్రెడిట్ ఇవ్వక తప్పదు. వీళ్లిద్దరూ భారత బ్యాటింగ్ యూనిట్ను ముందుండి నడిపిస్తున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా లేదా ఛేజింగ్కు దిగినా రోహిత్, కోహ్లీల్లో ఎవరో ఒకరు క్రీజులో పాతుకుపోతున్నారు. రోహిత్ ఫెయిలైతే టీమ్ను విరాట్ ముందుండి నడిపిస్తున్నాడు. ఒకవేళ కోహ్లీ వెనుదిరిగినా హిట్మ్యాన్ మిగిలిన పని పూర్తి చేస్తున్నాడు. ఇలా ఇద్దరు సీనియర్ బ్యాటర్లు టీమ్ విజయాల్లో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు. బ్యాటింగ్లోనే కాదు.. బౌలింగ్ టైమ్లోనూ బౌలర్లకు కీలక సూచనలు ఇస్తున్నాడు రోహిత్.
ఫీల్డింగ్లోనూ కెప్టెన్ రోహిత్కు అవసరమైన టైమ్లో విరాట్ అండగా ఉంటున్నాడు. బౌలర్లను ఎంకరేజ్ చూస్తున్నాడు కోహ్లీ. ఈ వరల్డ్ కప్లో కోహ్లీ 442 రన్స్ చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్టులో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. రోహిత్ 402 రన్స్తో ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. వీళ్లిద్దరూ ఇలాగే తమ జోరును కొనసాగిస్తే వరల్డ్ కప్ మనదేనని చెప్పొచ్చు. ఇప్పటిమటుకు రోహిత్, కోహ్లీలు ఉన్నారు సరే.. వీళ్ల తర్వాత భారత టీమ్ ఫ్యూచర్ ఏంటనే ఆలోచనలు మీకూ వచ్చే ఉంటాయి. అయితే టీమిండియా భవిష్యత్తుకు ఓ యువ బ్యాటర్ భరోసా ఇస్తున్నాడు. అతడే యంగ్ ఓపెనర్ శుబ్మన్ గిల్.
భారత టీమ్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే తన ప్లేస్ను పర్మినెంట్ చేసుకున్నాడు శుబ్మన్ గిల్. వరుసగా సెంచరీల మీద సెంచరీలు బాదుతూ టెస్టులు, వన్డేలు, టీ20ల్లో రెగ్యులర్ ప్లేయర్గా మారాడు. కెప్టెన్ రోహిత్తో కలసి ధనాధన్ ఇన్నింగ్స్లు ఆడుతూ టీమ్కు అదిరిపోయే ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ అందిస్తున్నాడు. ఈ ఏడాది వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసింది గిల్ కావడం విశేషం. గిల్ 1426 రన్స్ చేయగా.. ఆ తర్వాతి ప్లేసులో రోహిత్ (1060 రన్స్), కోహ్లీ (1054 రన్స్) ఉన్నారు. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ డామినేషన్ ఏ లెవల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం భారత బ్యాటింగ్ యూనిట్కు వెన్నెముకలా మారిన గిల్ భారత ఫ్యూచర్ అని క్రికెట్ మాజీలు, అనలిస్టులు కూడా అంటున్నారు. మరి.. టీమిండియా ఫ్యూచర్ గిల్ అని మీరు భావిస్తే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కెరీర్ స్టార్టింగ్ నుంచి అదే చేస్తున్నా.. అందుకే ఇంత సక్సెస్: షమి