iDreamPost
android-app
ios-app

Video: కెప్టెన్సీ కాంట్రవర్సీ తర్వాత ఫస్ట్ టైమ్ బయటకు.. పాండ్యాకు ఘోర అవమానం!

  • Published Dec 22, 2023 | 2:46 PM Updated Updated Dec 22, 2023 | 5:39 PM

కెప్టెన్సీ కాంట్రవర్సీ తర్వాత పాండ్యా తొలిసారి బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే అతడికి రోహిత్ ఫ్యాన్స్ నుంచి ఘోర అవమానం ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కెప్టెన్సీ కాంట్రవర్సీ తర్వాత పాండ్యా తొలిసారి బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే అతడికి రోహిత్ ఫ్యాన్స్ నుంచి ఘోర అవమానం ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Video: కెప్టెన్సీ కాంట్రవర్సీ తర్వాత ఫస్ట్ టైమ్ బయటకు.. పాండ్యాకు ఘోర అవమానం!

రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యా మధ్య కెప్టెన్సీ వివాదం పెద్ద దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన టీమిండియా ఆటగాళ్లను రెండుగా చిల్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్ నుంచి తప్పించి క్యాష్ ఆన్ ట్రేడ్ విధానంలో ముంబై టీమ్ లోకి వచ్చిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు సారథ్య పగ్గాలు అప్పగించింది ముంబై యాజమాన్యం. దీంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ముంబై ఫ్రాంచైజీపై, పాండ్యాపై గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ అన్ ఫాలో చేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ కాంట్రవర్సీ తర్వాత పాండ్యా తొలిసారి బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే అతడికి ఘోర అవమానం ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా తొలగించడంతో.. రోహిత్ ఫ్యాన్స్ తో పాటుగా, సగటు క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ కు అండగా నిలుస్తూ.. పాండ్యాపై, ముంబై యజమాన్యంపై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ఇక కెప్టెన్సీ వివాదం తర్వాత రోహిత్ ఇటీవల ఓ కార్యక్రమానికి తన భార్య రితికా సజ్దేతో కలిసి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా బాధలో ఉన్నారు ఈ దంపతులిద్దరు. వీరిని ఇలా బాధలో చూసిన రోహిత్ ఫ్యాన్స్ పాపం అంటూ ఫీలవుతున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా కెప్టెన్ గా నియమితులైన తర్వాత పాండ్యా తొలిసారి బయటకి వచ్చాడు. ఈ క్రమంలోనే ఊహించని షాక్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ నుంచి పాండ్యాకు ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. హార్దిక్ పాండ్యా ఎక్కడికో వెళ్తున్న క్రమంలో కెమెరా కంటికి చిక్కాడు. ఇక అక్కడే ఉన్న రోహిత్ ఫ్యాన్స్ “ముంబైకా రాజా రోహిత్ శర్మ.. ముంబై కా రాజా రోహిత్ శర్మ” అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ సమయంలో ఏం చేయాలో పాండ్యాకు అర్దం కాక.. కామ్ గా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాండ్యాకు ఇంతకంటే ఘోర అవమానం ఇంకోటి ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం పాండ్యా గాయంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మరి పాండ్యాకు జరిగిన ఘోర అవమానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.