iDreamPost
android-app
ios-app

VIDEO: హైదరాబాద్‌లో పాకిస్థాన్‌ టీమ్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌! ఇంత క్రేజా?

  • Published Sep 28, 2023 | 6:11 PM Updated Updated Sep 28, 2023 | 6:11 PM
  • Published Sep 28, 2023 | 6:11 PMUpdated Sep 28, 2023 | 6:11 PM
VIDEO: హైదరాబాద్‌లో పాకిస్థాన్‌ టీమ్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌! ఇంత క్రేజా?

దాదాపు 7 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టింది. అది కూడా మన హైదరాబాద్‌ మహానగరంలోనే దిగింది. శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టులో బుధవారం రాత్రి ల్యాండ్‌ అయ్యారు పాక్‌ క్రికెటర్లు. త్వరలో ప్రారంభం కానున్న వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో పాల్గొనేందుకు పాకిస్థాన్‌ జట్టు ఇండియా వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఎయిర్‌పోర్టులో లభించిన అపూర్వ స్వాగతానికి పాకిస్థాన్ ఆటగాళ్లు అవాక్కయ్యారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌తో పాటు స్టార్ పేసర్ షాహిన్ షా అఫ్రిది సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ అభిమానులు చూపిన ప్రేమకు ఫిదా అయినట్లు పేర్కొనడం విశేషం.

ఎయిర్‌పోర్టులో క్రికెట్‌ అభిమానుల నుంచి ఊహించని విధంగా ఘనస్వాగతం అందుకున్న తర్వాత.. పాక్‌ టీమ్‌ పార్క్‌ హయత్‌ హోటల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో వారికి హైదరాబాద్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాయి. అయితే.. తమకు లభించిన గ్రాండ్‌వెల్‌కమ్‌పై పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. ‘హైదరాబాద్ ప్రజల అభిమానం, ప్రేమకు ఫిదా అయ్యాను’ అని పోస్టు చేశాడు. ‘భారత్‌లోని హైదరాబాద్‌లో మాకు గొప్ప స్వాగతం లభించింది.’ అని షాహిన్ షా అఫ్రిది ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.

ఇక శుక్రవారం ఉప్పల్‌ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో పాక్‌ జట్టు తమ తొలి వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. కాగా, ఈ మ్యాచ్‌లకు భద్రతా కారణాలతో పోలీసులు ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఖాళీ స్టేడియంలోనే పాక్‌-న్యూజిలాండ్‌ వార్మప్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి. అయితే.. పాకిస్థాన్ చివరగా 2016 టీ20 ప్రపంచకప్‌ కోసం భారత్‌కు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే రావడం. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదనే విషయం తెలిసిందే. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్‌-పాక్‌ జట్లు తలపడుతున్నాయి. పాకిస్థాన్‌ మన దేశానికి వస్తుంది కానీ, భద్రతా కారణాల రిత్యా టీమిండియాను పాకిస్థాన్‌కి పంపడం లేదు బీసీసీఐ. అయితే.. ఈ వరల్డ్‌ కప్‌లో అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మధ్య అహ్మదాబాద్ వేదికగా హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. మరి పాక్‌ జట్టుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో లభించిన ఘనస్వాగతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నవీన్ ఉల్ హక్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే క్రికెట్​కు గుడ్​బై!