iDreamPost
android-app
ios-app

కోహ్లీ.. గాంధీ మనవడు! ఇండియాలో రచ్చ రచ్చ చేస్తున్నాడు.. ఎవరీ స్పీడ్‌?

కోహ్లీ.. గాంధీ మనవడు! ఇండియాలో రచ్చ రచ్చ చేస్తున్నాడు.. ఎవరీ స్పీడ్‌?

వన్డే వరల్డ్ కప్ ఫీవర్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్ లతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. టీమిండియాకు దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 14న జరుగబోయే భారత్, పాక్ మ్యాచ్ ను వీక్షించేందుకు భారత్ చేరుకుంటున్నారు. దీనిలో భాగంగానే యూఎస్ కు చెందిన ఓ యూట్యూబర్ ఇండియాకు వచ్చాడు. అతడి పేరు స్పీడ్. డిఫరెంట్ కంటెంట్ తో వీడియోలు చేసి 20 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ను సంపాధించుకున్నాడు. ఇతడు ఫుట్ బాల్ క్రీడా దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకు వీరాభిమాని. ఫుట్ బాల్ మ్యాచ్ ఉందంటే చాలు అక్కడ వాలిపోతూ వీడియోలు చేస్తుంటాడు.

కాగా స్పీడ్ ప్రస్తుతం ముంబైలో సందడి చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ జెర్సీ ధరించి ముంబై వీధుల్లో క్రికెట్ ఆడుతూ స్థానికులను అలరిస్తున్నాడు. క్రికెట్ ఆడుతున్న సమయంలో బాల్ మిస్ అవ్వగా నేను బాబర్ ఆజాంలా ఆడుతున్నానంటూ నవ్వులు పూయించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇతడికి విరాట్ కోహ్లీ అంటే అమితమైన అభిమానం ఉన్నట్లు వెల్లడైంది. 100 రూపాయల నోటుపై గాంధీ బొమ్మను చూపిస్తూ కోహ్లీ గాంధీ మనవడు అంటూ రచ్చ రచ్చ చేస్తున్నాడు స్పీడ్. కాగా స్పీడ్ కింగ్ కోహ్లీకి, టీమిండియాకు సపోర్ట్ చేసేందుకు భారత్ చేరుకున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by InsideSport Cricket (@insidesport__cricket)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి