iDreamPost
android-app
ios-app

షకీబ్​కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మాథ్యూస్ సోదరుడు.. శ్రీలంకకు వస్తే..!

  • Author singhj Published - 10:51 AM, Thu - 9 November 23

బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్​కు శ్రీలంక ఆల్​రౌండర్ ఏంజెలో మాథ్యూస్ సోదరుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. లంకకు వస్తే అంటూ హెచ్చరించాడు.

బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్​కు శ్రీలంక ఆల్​రౌండర్ ఏంజెలో మాథ్యూస్ సోదరుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. లంకకు వస్తే అంటూ హెచ్చరించాడు.

  • Author singhj Published - 10:51 AM, Thu - 9 November 23
షకీబ్​కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మాథ్యూస్ సోదరుడు.. శ్రీలంకకు వస్తే..!

సాఫీగా సాగిపోతున్న వన్డే వరల్డ్ కప్​-2023లో ‘టైమ్డ్ ఔట్’ అంశం పెద్ద దుమారపే రేపింది. బంగ్లాదేశ్-శ్రీలంక టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో సీనియర్ ఆల్​రౌండర్ ఏంజెలో మాథ్యూస్​ను టైమ్డ్ ఔట్​గా ప్రకటించడం కాంట్రవర్సీగా మారింది. ఇన్నేళ్ల క్రికెట్ హిస్టరీలో ఇలా ఒక బ్యాటర్ ఔట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం. సాధారణంగా ఒక బ్యాట్స్​మన్​ ఔట్ అయితే నెక్స్ట్ బ్యాటర్ మూడు నిమిషాల్లోగా క్రీజులోకి వచ్చేయాలి. అయితే ఈ రూల్​ను వరల్డ్ కప్​లో రెండు నిమిషాలకు కుదించారు. బంగ్లాతో మ్యాచ్​లో మాథ్యూస్​ నిర్ణీత సమయంలోపే క్రీజులోకి చేరుకున్నప్పటికీ అతడి హెల్మెట్ స్ట్రాప్ తెగిపోయింది. దీంతో వేరే హెల్మెట్ కోసం అడిగాడతను. అది వచ్చే సరికి సమయం అయిపోయింది.

నిర్ణీత సమయం అయిపోవడంతో మాథ్యూస్​ను ఔట్​గా ఇవ్వాలంటూ అంపెర్లను బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ కోరాడు. ఈ అప్పీల్ విషయంలో సీరియస్​గానే అడుగుతున్నావా? అంటూ షకీబ్​ను అంపైర్ అడిగాడు. ఔను, రూల్​లో ఉంది కాబట్టే అడుగుతున్నానంటూ అతను అనడంతో మాథ్యూస్​ను ఔట్​గా ప్రకటించాడు అంపైర్. ఈ డెజిజన్​తో షాకైన లంక బ్యాటర్.. అప్పీల్ వెనక్కి తీసుకోవాలని షకీబ్​ను కోరాడు. అయితే అతడు వెనక్కి తగ్గకపోవడంతో నిరాశతో గ్రౌండ్​ను వీడాడు మాథ్యూస్. ఈ వివాదం ఇక్కడితో ఎండ్ కాలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్-శ్రీలంక ప్లేయర్లు ఒకరికొకరు షేడ్ హ్యాండ్స్ ఇచ్చుకోలేదు. మ్యాచ్ తర్వాత షకీబ్ తన అప్పీల్​ను సమర్థించుకున్నాడు. అయితే అతడిపై విమర్శలకు దిగాడు మాథ్యూస్.

పదిహేనేళ్ల ఇంటర్నేషనల్ కెరీర్​లో బంగ్లా లాంటి చెత్త టీమ్​ను తాను చూడలేదని మాథ్యూస్ అన్నాడు. తాను నిర్ణీత సమయంలోపే క్రీజులోకి వచ్చేశానంటూ మ్యాచ్ ఫుటేజీ వీడియోలు, ఫొటోలను చూపించాడతను. దీంతో అంపైర్ల తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. షకీబల్ హసన్​కు ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ మాథ్యూస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ‘టైమ్డ్ ఔట్’ విషయంలో బంగ్లా కెప్టెన్ వ్యవహరించిన తీరుకు కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. స్పోర్ట్ స్పిరిట్​ను మరిచిన షకీబ్ గనుక లంకలో అడుగుపెడితే ఫ్యాన్స్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు. ఇక్కడికి వస్తే షకీబ్​ను​ రాళ్లతో సన్మానించడం ఖాయమని తీవ్ర విమర్శలు చేశాడు. మరి.. షకీబ్​కు మాథ్యూస్ సోదరుడు మాస్ వార్నింగ్ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మాక్స్ వెల్ కోసం బై రన్నర్ ఎందుకు రాలేదు? రీజన్ ఇదే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి