బిగ్ బ్రేకింగ్: మాజీ మంత్రి హరీశ్ రావు వాహనంపై రాళ్ల దాడి!

T Harish Rao: మాజీ మంత్రి , సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు వాహనంపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఇదే సమయంలో ఈ వాహనంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నామా నాగేశ్వరావు కూడా ఉన్నారు. ఇంతకీ ఎక్కడ జరిగిదంటే..

T Harish Rao: మాజీ మంత్రి , సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు వాహనంపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఇదే సమయంలో ఈ వాహనంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నామా నాగేశ్వరావు కూడా ఉన్నారు. ఇంతకీ ఎక్కడ జరిగిదంటే..

గతం రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొట్టాయి. ఈ క్రమంలోనే ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని అనేక ప్రాంతాలు జలమయ్యం అయ్యాయి. ఊహించని స్థాయిలో ఆర్థిక నష్టం జరిగింది. ఈ రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలోని నదులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇది ఇలాంటే.. వరదల ప్రభావిత ప్రాంతాలను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నేతలు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మంలో ఉద్రికత్త చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్సించే క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య పరస్పరం వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈదాడి జరిగిన సమయంలో కారులో హరీశ్ రావుతో పాటు మాజీ మంత్రులు నామా నాగేశ్వరావు, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

Show comments