iDreamPost
android-app
ios-app

వైసీపీ ఏడాది పాలన.. ఆరు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు

వైసీపీ ఏడాది పాలన.. ఆరు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకునే సందర్భంగా రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు వివిధ అంశాలపై ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా కార్యక్రమాల వివరాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం కార్యదర్శి విజయ్‌కుమార్‌ వెల్లడించారు. రేపటి నుంచి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 30వ తేదీ వరకూ ‘మన పాలన – మీ సూచన’ పేరు పై ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.

ఇదీ షెడ్యూల్‌..

– 25న పరిపాలన సంస్కరణలు, సంక్షేమంపై సదస్సు

– 26న వ్యవసాయం, అనుబంధ రంగాలపై సదస్సు

– 27న విద్యారంగం సంస్కరణలు, పథకాలపై సదస్సు

– 28న పరిశ్రమలు, పెట్టుబడుల రంగంపై సదస్సు

– 29న వైద్య, ఆరోగ్య రంగంలో సంస్కరణలు, పథకాలపై సదస్సు

– 30న రైతు భరోసా కేంద్రాలను సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభం

ఈ కార్యక్రమాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొంటారు. జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల మంత్రుల ఆధ్వర్యంలో 50 మందికి మించకుండా సదస్సులు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ సదస్సులు జరగనున్నాయి. ప్రజల నుంచి ఆయా అంశాల్లో సూచనలు, సలహాలు ప్రభుత్వం తీసుకోనుంది.