వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని చితక్కొడుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్తో చెలరేగిపోతున్నాడు. శుబ్మన్ గిల్ రీసెంట్గా జ్వరం నుంచి కోలుకొని వచ్చాడు. కొన్నాళ్లుగా అతడు మంచి ఫామ్లోనే ఉన్నాడు. కాబట్టి అతడితో ఇబ్బంది లేదు. విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్లో కేఎల్ రాహుల్ కూడా సత్తా చాటాడు. మరో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్లపై రాణించాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాటింగ్లో పెద్దగా ఛాన్స్ రాలేదు. ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో అతడు బంతితో ఆకట్టుకున్నాడు.
బౌలింగ్లో పేసర్లు బుమ్రా, సిరాజ్తో పాటు స్పిన్నర్లు కుల్దీప్, జడేజా జోరు మీద ఉన్నారు. భారత జట్టులో మొత్తం పది స్థానాలపై ఎలాంటి ఆందోళన లేదు. కానీ మెయిన్ టీమ్లో ఆడుతున్న వారిలో ఒక్క ఆటగాడి మీద మాత్రం టీమ్ మేనేజ్మెంట్కు ఉన్న నమ్మకం ఫ్యాన్స్కు కలగట్లేదు. ఆ ప్లేయరే.. శార్దూల్ ఠాకూర్. వన్డేల్లో అతడి స్టాటిస్టిక్స్ ఆశించిన స్థాయిలో లేకున్నా.. రీసెంట్ ఫామ్ అంతంతమాత్రంగానే ఉన్నా రెగ్యులర్గా తుది జట్టులో ఆడుతున్నాడు శార్దూల్. కెరీర్లో మొత్తంగా 46 వన్డేల్లో అతడు తీసింది 64 వికెట్లే. ప్రస్తుత ప్రపంచ కప్లో 8 ఓవర్లు వేసి 43 రన్స్ ఇచ్చిన ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఒక్క వికెటే తీశాడు.
లోయరార్డర్లో బ్యాటింగ్లో శార్దూల్ ఉపయోగపడతాడని అనుకుంటున్నా.. ఇప్పటివరకు హార్దిక్ పాండ్యాకే బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. అయినా శార్దూల్ ప్రధానంగా బౌలర్ అనే సంగతి గుర్తుంచుకోవాలి. ఇందులో అతడు పెద్దగా రాణిస్తున్నది లేదు. ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాతో ఎక్కువ ఓవర్లు వేయిస్తున్నారు. శార్దూల్ను పెద్దగా వాడుకోవడం లేదు. దీనికో కారణం ఉంది. టీమ్కు అవసరమైనప్పుడల్లా పాండ్యా వికెట్ తీస్తుండటమే. పాండ్యాకు బౌలింగ్ ఇచ్చి.. శార్దూల్ను దూరం పెడుతున్నారంటే అతడిపై కెప్టెన్కు అంత నమ్మకం లేదేమోనని అనిపిస్తోందని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. అదే టైమ్లో ధారాళంగా రన్స్ ఇచ్చేస్తాడనే పేరు కూడా శార్దూల్కు ఉండనే ఉంది.
ఎక్కువ రన్స్ ఇస్తాడనే భయంతోనే శార్దూల్కు కోటా పూర్తి చేసే ఛాన్స్ను రోహిత్ ఇవ్వట్లేదని విశ్లేషకులు చెబుతున్నారు. పిచ్ స్పిన్కు అనుకూలిస్తుందని తొలి వన్డేలో రవిచంద్రన్ అశ్విన్ను ఆడించిన టీమ్ మేనేజ్మెంట్.. తర్వాతి రెండు మ్యాచులకు అతడ్ని తప్పించి శార్దూల్ను తీసుకుంది. గత రెండు వన్డేల్లో శార్దూల్ ఆడటం వల్ల భారత్కు పెద్దగా ఒరిగిందేమీ లేదు. అహ్మదాబాద్ వన్డేలో శార్దూల్ ప్లేస్లో ఎంతో ఎక్స్పీరియెన్స్ ఉన్న మహ్మద్ షమీని ఆడించాల్సిందనే కామెంట్స్ వినిపించాయి. ఐపీఎల్లో గుజరాత్కు ఆడే షమీకి అహ్మదాబాద్ హోం గ్రౌండ్ లాంటిదని.. అతడు బరిలోకి దిగితే పాక్ను మరింత తక్కువ స్కోరుకే కట్టడి చేసేవారమని అనలిస్టులు అంటున్నారు.
వరల్డ్ కప్కు ముందు ఆస్ట్రేలియాతో సిరీస్లో షమి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక మ్యాచ్లో 5 వికెట్లు తీశాడు. ఎంతో అనుభవం ఉన్న షమి మంచి వేగంతో నిలకడగా ఒకే చోట బంతులు వేయగలడు. తరచూ వికెట్లు తీసే షమీని కాకుండా శార్దూల్ను ఆడించడానికి టీమ్ మేనేజ్మెంట్ గుడ్డి నమ్మకమే కారణమని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంటున్నారు. నాలుగో పేసర్ను తీసుకోవాలంటే బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉండాలనే గుడ్డి టెంప్లేట్ను మేనేజ్మెంట్ ఫాలో అవుతుండటమే షమీని జట్టులోకి రాకుండా ఆపుతోందని చెబుతున్నారు. తదుపరి మ్యాచుల్లో శార్దూల్నే మళ్లీ బరిలోకి దింపుతారా లేదా షమీకి ఛాన్స్ ఇస్తారో చూడాలి. మరి.. షమీని ఆడించకుండా మేనేజ్మెంట్ తప్పు చేస్తోందనే అభిప్రాయాలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: World Cup 2023: పెద్ద జట్లను ముంచుతున్న చెత్త ఫార్ములా!