iDreamPost
android-app
ios-app

టీమిండియాపై ఓటమితో బాధలో ఉన్న పాక్​కు కొత్త కష్టం!

  • Author singhj Published - 02:48 PM, Wed - 18 October 23
  • Author singhj Published - 02:48 PM, Wed - 18 October 23
టీమిండియాపై ఓటమితో బాధలో ఉన్న పాక్​కు కొత్త కష్టం!

వన్డే వరల్డ్ కప్-2023లో మొదటి రెండు మ్యాచుల వరకు పాకిస్థాన్ జట్టు ఫేవరెట్స్​లో ఒకటిగా కనిపించింది. వరుసగా రెండు విజయాలతో బాబర్ సేన ఫుల్​ జోష్​గా అనిపించింది. కానీ ఒకే ఒక్క మ్యాచ్​ ఆ టీమ్ ప్లేయర్స్​తో పాటు వారి ఫ్యాన్స్​లోనూ నిరాశను కమ్మేసింది. అదే భారత్​తో జరిగిన మ్యాచ్. ఈ ఇరు టీమ్స్ గ్రౌండ్​లో తలపడుతున్నాయంటే మ్యాచ్​ చాలా టఫ్​గా ఉంటుందని అంతా అనుకుంటారు. చివరి వరకు ఉత్కంఠ పోరు ఉంటుందని, ఫుల్ పైసా వసూల్ ఎంటర్​టైన్​మెంట్ అని భావిస్తారు. కానీ దీనికి భిన్నంగా జరిగింది. రోహిత్ సేన పవర్​ఫుల్ పెర్ఫార్మెన్స్ ముందు పాకిస్థాన్ నిలబడలేకపోయింది.

భారత్ చేతుల్లో చిత్తవడంతో పాక్ జట్టు నిరాశలో కూరుకుపోయింది. ఓటమి కంటే కూడా బౌలింగ్, బ్యాటింగ్​లో దారుణంగా ఫెయిలవ్వడం ఆ టీమ్​ను బాధిస్తోంది. పాక్ ప్లేయర్ల ఆటతీరుపై అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఇలా ఆడితే ఇక వరల్డ్ కప్ వచ్చినట్లేనని ఫైర్ అవుతున్నారు. బాబర్ ఆజం కెప్టెన్సీ ఫెయిల్యూర్ వల్లే టీమ్​కు ఓటమి ఎదురైందని విమర్శిస్తున్నారు. టీమ్ సెలక్షన్ బాగోలేదని.. వరుసగా విఫలమవుతున్నా స్పిన్నర్లు షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్​ను ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని సీనియర్ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు.

భారత్​పై ఓడిన పాకిస్థాన్ నెక్స్ట్ ఆస్ట్రేలియాతో తలపడేందుకు రెడీ అవుతోంది. అయితే కీలక మ్యాచ్​కు ముందు ఆ టీమ్​ ఫ్యాన్స్​కు బ్యాడ్ న్యూస్. బాబర్ సేనను విషజ్వరాలు బాధిస్తున్నాయి. దాయాది జట్టులో చాలా మంది జ్వరంతో బాధపడుతున్నారని.. కొంతమందికి కాస్త నయం కాగా.. ఇంకొందరు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారని పీసీబీ మీడియా మేనేజర్ అషాన్ ఇఫ్తికార్ తెలిపారు. గత మ్యాచ్​లో టీమిండియాలో చేతిలో చిత్తుగా ఓడిన పాక్.. అక్టోబర్ 20న ఆసీస్​తో తాడోపేడో తేల్చుకోనుంది. ఈ మ్యాచ్​లో ఓడితే పాక్​కు సెమీస్ కష్టాలు మరింత పెరుగుతాయి.

ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు బెంగళూరుకు చేరుకున్నాయి. పాక్ కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిదీ హెల్తీగా ఉన్నారని తెలుస్తోంది. కీలక మ్యాచ్​కు ముందు వచ్చిన కొత్త సమస్య నుంచి పాక్ ఎలా బయటపడుతుందో చూడాలి. బాబర్ సేన దుస్థితిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ స్పందిస్తున్నారు. పాపం పాక్​కు ఏదీ కలసి రావడం లేదని అంటున్నారు. విషజ్వరాలు వీడకపోతే ఆ టీమ్ పనైపోయినట్లేనని చెబుతున్నారు. మరి.. భారత్​పై ఓటమితో బాధలో ఉన్న పాక్​కు కొత్త సమస్య రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బంగ్లాతో మ్యాచ్.. సరికొత్త ప్లాన్ చేస్తున్న రోహిత్!