iDreamPost
android-app
ios-app

కానిస్టేబుల్ ఆత్మహత్య.. పోస్ట్ మార్టం రిపోర్టులో సంచలన నిజాలు!

ఉత్తర్ ప్రదేశ్ లో ఓ మహిళా కానిస్టేబుల్ పోలీస్ లైన్ లోని వసతి గృహంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే తాజాగా పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసుల వద్దకు చేరింది. ఇంతకు అందులో ఏం తేలిందంటే?

ఉత్తర్ ప్రదేశ్ లో ఓ మహిళా కానిస్టేబుల్ పోలీస్ లైన్ లోని వసతి గృహంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే తాజాగా పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసుల వద్దకు చేరింది. ఇంతకు అందులో ఏం తేలిందంటే?

కానిస్టేబుల్ ఆత్మహత్య.. పోస్ట్ మార్టం రిపోర్టులో సంచలన నిజాలు!

ఉత్తర్ ప్రదేశ్ లో ఓ మహిళా కానిస్టేబుల్ పోలీస్ లైన్ లోని వసతి గృహంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే తాజాగా పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసుల వద్దకు చేరింది. ఆ రిపోర్ట్ లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఇంతకు అందులో ఏం తేలిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మీను అనే ఈ మహిళా ఉన్నావ్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ గురువారం ఆమె పోలీస్ లైన్ లోని వసతి గృహంలో ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. ఆ యువతి అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని ఆ యువతి మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇక తాజాగా పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసుల చెంతకు చేరడంతో అందులో సంచలన నిజాలు తెలిశాయి.

ఆమె ఒంటిపై 500కు పైగా గాయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆమె తనను తాను దాడి చేసుకుని ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. మరో విషయం ఏంటంటే? ఈ యువతి అలీగడ్ కు చెందిన ఓ కానిస్టేబుల్ తో ప్రేమ వ్యవహారం నడిపినట్లుగా స్థానికులు తెలిపారు. కాగా, గత కొంత కాలం నుంచి ఆ యువకుడు మీనును పట్టించుకోకపోవడం, పైగా మరో మహిళను కూడా పెళ్లి చేసుకున్నట్లు సమచారం. మొత్తానికి ప్రియుడు మోసం చేయడంతో మీను తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి