iDreamPost

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఒంటిపై 500కుపైగా గాయాలు!

ఉత్తర్ ప్రదేశ్ లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. మరో షాకింగ్ ఘటన ఏంటంటే? ఆమె ఒంటిపై 500కు పైగా గాయాలు ఉండడంతో అనేక అనుమానాలకు తావిస్తుంది.

ఉత్తర్ ప్రదేశ్ లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. మరో షాకింగ్ ఘటన ఏంటంటే? ఆమె ఒంటిపై 500కు పైగా గాయాలు ఉండడంతో అనేక అనుమానాలకు తావిస్తుంది.

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఒంటిపై 500కుపైగా గాయాలు!

ఉత్తర్ ప్రదేశ్ లోని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. మరో షాకింగ్ ఘటన ఏంటంటే? ఆమె ఒంటిపై 500కు పైగా గాయాలు ఉండడంతో అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె అప్పటికే చనిపోయింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆ మహిళ మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ ఉన్నావ్ పరిధిలోని ఓ ప్రాంతంలో మీను అనే యువతి కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈ యువతి మరో కానిస్టేబుల్ తో ప్రేమ వ్యవహారం నడిపినట్లుగా తెలుస్తుంది. ఇటీవల అతడు మరో యువతితో పెళ్లికి సిద్దమవ్వడం, ఎన్ని సార్లు ఫోన్ చేసిన సమాధానం ఇవ్వకపోవడంతో మీను తీవ్ర మనస్థాపానికి లోనైంది. ఇక గురువువారం ఉన్నావ్ లోని పోలీస్ లైన్ లో వసతీ గృహంలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే స్పందించిన కొందరు స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

కానీ, ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె ఒంటిపై 500కు పైగా గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ప్రియుడు మోసం చేసిన కారణంగానే ఆ యువతి తనకు తాను గాయాలు చేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి