మన దేశంలో ప్రస్తుతం ఉన్న బెస్ట్ టాలెంటెడ్ యంగ్ క్రికెటర్స్లో అభిషేక్ శర్మ ఒకడు. లెఫ్టాండర్ అయిన అభిషేక్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ సత్తా చూపించగలడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పలుమార్లు తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. పొట్టి లీగ్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడుతున్న అభిషేక్ శర్మ ఓ తుఫానీ ఇన్నింగ్స్తో మళ్లీ వార్తల్లో నిలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఆంధప్రదేశ్తో రాంచీ వేదికగా ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో అభిషేక్ 42 బంతుల్లోనే వంద మార్క్ను చేరుకున్నాడు.
ఆంధ్రాతో జరుగుతున్న మ్యాచ్లో అభిషేక్ శర్మ 9 ఫోర్లతో పాటు ఏకంగా 9 సిక్సులు బాదాడు. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ 112 రన్స్ చేసి పెవిలియన్కు చేరుకున్నాడు. అభిషేక్తో పాటు అన్మోల్ ప్రీత్ సింగ్ కూడా చెలరేగడంతో పంజాబ్ భారీ స్కోరు చేసింది. అన్మోల్ 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. అతడు మొత్తంగా 26 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 87 రన్స్ చేసి ఔటయ్యాడు. అన్మోల్ బ్యాటింగ్ చేస్తున్న తీరుకు ఒక దశలో టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ స్టీఫెన్ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన తర్వాత అతడు ఔటయ్యాడు. మరో 13 రన్స్ చేస్తే అతడి సెంచరీ పూర్తయ్యేది.
క్రీజులో ఉన్నంత సేపు ఆంధ్రా బౌలర్లను వణికించిన అన్మోల్ కొద్దిలో టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసే ఛాన్స్ను మిస్ చేసుకున్నాడు. అతడితో పాటు అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 275 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో టోర్నీ హిస్టరీలోనే అత్యధిక స్కోరు చేసిన టీమ్గా పంజాబ్ రికార్డు సృష్టించింది. ఇక, ఆంధ్రప్రదేశ్ బౌలర్లలో పృథ్వీరాజ్ యర్రా, చీపురుపల్లి స్టీఫెన్, త్రిపురన విజయ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అయితే అభిషేక్, అన్మోల్ బ్యాటింగ్లో చితక్కొట్టడంతో బలైన ఆంధ్రా బౌలర్లు 10కి పైగా యావరేజ్తో రన్స్ సమర్పించుకున్నారు. పృథ్వీరాజ్, హరిశంకర్రెడ్డి అయితే ఏకంగా 15కు పైగా సగటుతో రన్స్ సమర్పించుకున్నారు. మరి.. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ అభిషేక్ బ్యాటింగ్ విధ్వంసంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: దేశం కోసం.. వెన్నునొప్పిని లెక్కలేయకుండా బరిలోకి దిగాడు!