వన్డే వరల్డ్ కప్లో ఎంతో ఉత్కంఠ రేపిన భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఆడియెన్స్కు ఫుల్ మజాను పంచింది. టీమిండియా తన ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులకు పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్పై పాక్ కోచ్ మికీ ఆర్థర్ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. ఇండో-పాక్ మ్యాచ్ను చూస్తుంటే ఐసీసీ ఈవెంట్గా కాకుండా బీసీసీఐ ఈవెంట్లా ఉందని మికీ ఆర్థర్ కామెంట్స్ చేయడం తెలిసిందే. మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన పాక్ కోచ్.. తమ టీమ్ పెర్ఫార్మెన్స్ నిరాశపర్చిందన్నాడు. అయితే పరోక్షంగా ఐసీసీ మీద విమర్శలు గుప్పించాడు.
పాక్ ఆడేటప్పుడు స్టేడియంలో సరైన సపోర్ట్ లభించలేదన్నాడు మికీ ఆర్థర్. ఇది ఐసీసీ ఈవెంట్లా కాకుండా బైలాటరల్ సిరీస్ మ్యాచ్లా అనిపించిందని చెప్పాడు. మ్యాచ్లో పాక్ ఎందుకు ఫెయిలైందనే దానిపై మాట్లాడకుండా ఐసీసీ, బీసీసీఐ అంటూ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడంతో పాక్ మాజీ క్రికెటర్ల నుంచే మికీ ఆర్థర్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి కామెంట్స్ చేసే బదులు.. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవాలని పాక్ మాజీలు ఆర్థర్కు హితవు పలికారు. తాజాగా ఈ కాంట్రవర్సీపై ఐసీసీ రియాక్ట్ అయింది.
ఇలాంటి కాంటర్షియల్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదంటూ పాకిస్థాన్ కోచ్ మికీ ఆర్థర్పై ఐసీసీ సీరియస్ అయింది. ‘ఐసీసీ నిర్వహించే ప్రతి ఈవెంట్లో ఏదో ఒక దశలో ఇలాంటి కామెంట్స్ వస్తుంటాయి. అయితే, మేం వాటికి దూరంగా ఉంటాం. టోర్నీని మరింత బాగా నిర్వహిచేందుకు కావాల్సిన చర్యలు చేపడతాం. ఇప్పుడే మెగా టోర్నీ మొదలైంది. ఇంకా అనేక మ్యాచ్లు జరగాల్సి ఉంది. టోర్నీని అత్యుత్తమంగా నిర్వహించేందుకు ఎలాంటి మార్పులు చేయాలి? అనే విషయంపై ఫోకస్ చేస్తాం. ప్రతి ఒక్కరికీ క్రికెట్ను దగ్గర చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. తప్పకుండా ఇదో బెస్ట్ వరల్డ్ కప్గా నిలుస్తుందని ఆశిస్తున్నా’ అని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే స్పష్టం చేశాడు. మరి.. పాక్-ఐసీసీ వివాదంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: టీమిండియాపై పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ సవాల్ తప్పదంటూ..!