iDreamPost
android-app
ios-app

లండన్ లో హైదరాబాద్ యువతి దారుణ హత్య.. ఏం జరిగిందంటే!

  • Published Jun 14, 2023 | 3:00 PMUpdated Jun 14, 2023 | 3:00 PM
  • Published Jun 14, 2023 | 3:00 PMUpdated Jun 14, 2023 | 3:00 PM
లండన్ లో హైదరాబాద్ యువతి దారుణ హత్య.. ఏం జరిగిందంటే!

విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసి.. జీవితంలో మంచి పొజిషన్ లో స్థిరపడాలని భావించింది ఆ యువతి. తల్లిదండ్రులు కూడా ఆమెకి అండగా నిలిచారు. కుమార్తెకిబంగారు భవిష్యత్తు అందివ్వాలని భావించి.. ఉన్నత విద్య కోసం ఆమెని విదేశాలకు పంపారు. తన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటూ చదువుకోవడం కోసం లండన్ వెళ్లిన ఆ యువతి దారుణ హత్యకు గురయింది. బిడ్డ భవిష్యత్తు గురించి కలలు కంటున్న ఆ తల్లిదండ్రులు ఈ వార్త విని గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఆ వివరాలు..

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులపై దాడులు ఆగటం లేదు. కొన్ని రోజుల క్రితం టెక్సాక్ కాల్పుల్లో హైదరాబాద్ యువతి తాటికొండ ఐశ్వర్య మరణించిన ఘటన మరువక ముందే మరో ఘోరం చోటు చేసుకుంది. లండన్‌లో మరో తెలుగు అమ్మాయి దారుణ హత్యకు గురయింది. బ్రెజిల్‌కు చెందిన యువకుడు ఆమెపై దాడి చేయగా.. అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఏ మరో అమ్మాయి తీవ్రంగా గాయపడింది.

హైదరాబాద్‌ చంపాపేటకు చెందిన తేజస్విని ఉన్న త చదువుల కోసం లండన్ వెల్లింది. అక్కడే స్నేహితులతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో బ్రెజిల్‌కు చెందిన ఓ యువకుడు తేజస్వినితో పాటు అఖిల అనే మరో విద్యార్థినిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన తేజస్విని అక్కడికక్కడే మృతి చెందింది. అఖిలకు తీవ్ర గాయాలు కాగా.. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అసలు ఆ యువకుడు ఎవరు.. ఎందుకు అతడు అమ్మాయిల మీద దాడి చేశాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అశ్విని మృతి చెందినట్లుగా లండన్ అధికారులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కూతురు మరణవార్త తెలిసి తేజస్విని తల్లిదండ్రులు కన్నీరుగా మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి