iDreamPost
android-app
ios-app

మ్యారేజ్‌ డే గిఫ్ట్‌ ఇవ్వలేదని భర్తపై భార్య దారుణం

  • Published Mar 07, 2024 | 8:20 AM Updated Updated Mar 07, 2024 | 11:22 AM

ఎంతో ఆనందంగా గడుపుకోవలసిన పెళ్లిరోజునాడు ఓ మహిళ తన భర్తతో చిన్న కారణానికి గొడపడింది. అంతటితో ఆగాని ఆ మహిళ క్షణికావేశంలో చేసిన పనికి స్థానికులు ఆశ్చర్యపోయారు.

ఎంతో ఆనందంగా గడుపుకోవలసిన పెళ్లిరోజునాడు ఓ మహిళ తన భర్తతో చిన్న కారణానికి గొడపడింది. అంతటితో ఆగాని ఆ మహిళ క్షణికావేశంలో చేసిన పనికి స్థానికులు ఆశ్చర్యపోయారు.

  • Published Mar 07, 2024 | 8:20 AMUpdated Mar 07, 2024 | 11:22 AM
మ్యారేజ్‌ డే గిఫ్ట్‌ ఇవ్వలేదని భర్తపై భార్య దారుణం

క్షణికావేశం వేల అనర్థాలకు మూలం. ఇటీవలకాలంలో ఈ మాట చాలమందికి వర్తిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే గొడవపడిన కొందరు క్షణికావేశంలో.. ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యలు చేయడం వంటివి ఎక్కువ చేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ కలహాలతో వచ్చే గొడవల వల్ల క్షణికావేశంలో ఈ హత్యలకు కారణమవుతున్నాయి. అయితే ఎక్కువగా భార్య భర్తల మధ్య వచ్చే తగదాల వలన అనేక ఘోరాలు  జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. అక్రమ సంబంధాలని, అనుమానాలు, ఆర్ధిక విషయాల్లో గొడవలు పడి హత్యలు చేసే ఘటనలు ఎన్నో చూస్తునే ఉన్నాం. కానీ, తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ ఘటన మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. పెళ్లిరోజున భర్త దగ్గర నుంచి తాను ఆశించినది జరగలేనదని ఆ భార్య చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు.

జీవితంలో ప్రతిఒక్కరికి పెళ్లి రోజు అనేది ఎంతో మధురమైన జ్ఞాపకం. మరి అలాంటి ఆద్భుతమైన రోజున కానుక ఇవ్వకపోయినా పర్వలేదు కానీ, మార్చిపోకుండా ఉంటే చాలు అని చాలామంది భావిస్తారు. కానీ, తాజాగా జరిగిన ఓ ఘటనలో మాత్రం పెళ్లిరోజున మార్చిపోవడం మాట పక్కన పెడితే కానుక ఇవ్వలేదని ఓ భార్య తన భర్తను చాకుతో పొడిచింది.పెళ్లి రోజున భర్త తనకు వజ్రాల నెక్లెస్ కానీ, కనీసం చిన్న బంగారం ఉంగరమైనా ఇస్తాడని ఆశిస్తే.. ఎలాంటి కానుక ఇవ్వకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. అయితే ఈ ఘటన బెంగళూరులోని బెల్లందూరు పోలీసు స్టేషన్ పరిధిలోని జున్నసంద్రలో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. బెంగళూరులో నివాసం ఉంటున్న రియా ఘోష్ తన భర్త పార్థప్రతిమ్ లది స్వస్థలం పశ్చిమబెంగాల్. కాగా, వారు బెంగళూరుకు వలసవచ్చి అక్కడే ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు.

ఇక గతనెల ఫిబ్రవరి 27వ తేదీన  వీరి పెళ్లిరోజు కావడంతో.. తన భర్త కనీసం ఏ బహుమానం ఇవ్వలేదని ఆ మహిళ అతడితో గొడవపడింది. ఈ క్రమంలోనే క్షణికావేశంలో వంటింటిలో ఉన్న చాకుతో భర్త కడుపులో పొడించింది. దీంతో గాయపడిన అతన్ని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.ఇక విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలను సేకరించి కేసును నమోదు చేశారు. ప్రస్తుతం పార్థ ప్రతిమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే బంధువు చనిపోవడం వల్ల తాను పెళ్లి రోజున కానుకను ఇవ్వలేకపోయినట్లు బాధితుడు తెలిపాడు. ఈ క్రమంలోనే ఆమె దాడి చేసిందని ఆ వ్యక్తి వాపోయాడు.మరి, పెళ్లిరోజున కానుక ఇవ్వలేదని భర్తను పొడిచిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.