Keerthi
ఇటీవల కాలంలో ఆసుపత్రిలో జరుగుతున్న దారుణ ఘటనలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. వీటి పై ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. ఆసుపత్రిలో వారి చూపించే నిర్లక్ష్య వైఖరి మాత్రం అడుగడుగున అద్దం పట్టినట్టుగా కనిపిస్తునే ఉంటుంది. తాజాగా పురిటి నొప్పులతో ఓ ఆస్పత్రికి వెళ్లిన మహిళకు సెల్ ఫోన్ వెలుగులో సర్జరీ చేశారు. కానీ, ఆ తర్వాత ఊహించని దారుణం చోటు చేసుకుంది.
ఇటీవల కాలంలో ఆసుపత్రిలో జరుగుతున్న దారుణ ఘటనలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. వీటి పై ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. ఆసుపత్రిలో వారి చూపించే నిర్లక్ష్య వైఖరి మాత్రం అడుగడుగున అద్దం పట్టినట్టుగా కనిపిస్తునే ఉంటుంది. తాజాగా పురిటి నొప్పులతో ఓ ఆస్పత్రికి వెళ్లిన మహిళకు సెల్ ఫోన్ వెలుగులో సర్జరీ చేశారు. కానీ, ఆ తర్వాత ఊహించని దారుణం చోటు చేసుకుంది.
Keerthi
ప్రస్తుత కాలంలో ఆసుపత్రిలో జరుగుతున్న దారుణ ఘటనలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. కాగా, ఎన్ని ఘోరాలు జరిగిన, ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికి.. ఆసుపత్రిలో వారి చూపించే నిర్లక్ష్య వైఖరి మాత్రం అడుగడుగున అద్దం పట్టినట్టుగా కనిపిస్తునే ఉంటుంది. ముఖ్యంగా ప్రాణం పోసే వైద్యలే నిర్లక్ష్యం వ్యవహిరించడంతో.. చాలామంది నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ఇక ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ స్త్రీల విషయంలో అయితే వైద్యులతో పాటు ఆసుపత్రి సిబ్బంది కూడా చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. వారికి కనీస మౌలిక సదుపాయాలను అందించకపోగా.. సరైన సమయానికి ప్రసవం చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. అంతేకాకుండా.. ఈ ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం వలన ఇంక లోకం చూడని పసికందుల ప్రాణాలు కూడా పోతున్నాయి. అయితే తాజాగా పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లిన మరో మహిళకు వైద్యుల నిర్లక్ష్యంతో చేసే పనికి ఇద్దరి ప్రాణాలు బలి తీసుకున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ఇటీవలే పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్బిణి మహిళను ప్రసవం కోసం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకురాగా.. చివరకు అక్కడ వైద్యులు నిర్లక్ష్యంతో తల్లీబిడ్డల ఇద్దరి ప్రాణాలు పోయాయి. అయితే ఈ మహిళకు సాధారణ ప్రసవం కాకపోవడంతో కుటుంబసభ్యులకు చెప్పకుండానే సిజేరియన్ చేశారు. ఇక ఆ తర్వాత వచ్చి సంతకాలు తీసుకున్నారు. తీరా బాధిత కుటుంబం లోపలికి వెళ్లే సరికి దారుణం జరిగిపోయింది. కాగా, కడుపులో నుంచి తీసిన బిడ్డ చనిపోతే.. తల్లికి ఏం కాదని వైద్యులు చెప్పారు. కానీ, అంతలోనే ఆ మహిళ కూడా ప్రాణాలు విడిచింది. అయితే కరెంట్ పోవడంతో జనరేటర్ అన్ చేయకుండానే సెల్ ఫోన్ టార్చ్ వెలుగులో గర్భిణికి సిజేరియన్ చేయగా.. తల్లీబిడ్డ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దారుణమైన ఘటన ముంబై మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఆసుపత్రిలో రెండు రోజుల కిందట చోటుచేసుకుంది. కాగా, రూ. 52,000 కోట్ల బీఎంసీ బడ్జెట్లో ఆరోగ్యం కోసం కేటాయించిన మొత్తం 12 శాతం అంటే రూ. 6,250 కోట్లుతో నిర్మించిన ఆ ఆస్పత్రిలో విద్యుత్త్ సరఫరా నిలిచిపోతే సరైన సౌకార్యం లేకపోవడం గమన్హారం.
ఇక ఆ వివరాళ్లోకి వెళ్తే.. ఖుస్రుద్దీన్ అన్సారీ అనే దివ్యాంగుడి భార్య షాహిదున్కి సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు సుష్మా స్వరాజ్ మెటర్నిటీ హోమ్కు తీసుకొచ్చారు. అయితే ఉదయం 7 గంటలకు ఆసుపత్రికి తీసుకురాగా.. ఆ ఆసుపత్రిలో వైద్యులు రాత్రి 8 గంటల వరకూ సాధారణ కాన్పు అవుతుందని కుటుంబ సభ్యులకు రాత్రి 8 గంటల వరకూ సాధారణ కాన్పు అవుతుందని నమ్మబలికారు. కానీ, ఆ తర్వాత సిజేరియన్ చేయాలని తమ దగ్గర సంతకాలు తీసుకున్నారని, అప్పటికే విద్యుత్ సరఫరా నిలిచిపోయినా జనరేటర్ కూడా ఆన్ చేయలేదని ఆరోపించారు. పైగా మొబైల్ ఫోన్ టార్చ్ వెలుగులోనే సిజేరియన్ చేసి, తల్లీబిడ్డలను పొట్టనబెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వైద్యుల నిర్లక్ష్యానికి కుటుంబసభ్యులు రెండు రోజుల పాటు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేయడంతో బీఎంసీ దిగివచ్చి.. విచారణకు ఆదేశించింది.
అయితే ఈ ఘటనలో అన్సారీ తల్లి మాట్లాడుతూ.. నెలలు నిండిన మా కోడలు చాలా ఆరోగ్యంగా ఉంది. అలాగే ఆమెకు వైద్య నివేదికల్లో కూడా ఎటువంటి సమస్యలు లేవు. అయితే ఏప్రిల్ 29న ఉదయం పురిటి నొప్పులు రావడంతో 7 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చాం. ఇక రాత్రి 8 గంటల వరకూ అంతా బాగానే ఉంది. అలాగే వైద్యులు కూడా సాధారణ ప్రసవం అవుతుందని చెప్పారు. కానీ, తీరా నేను లోపలికి వెళ్లి చూసేసరికి ఆమె రక్తంతో తడిసిపోయి ఉంది. కోతవేసి ఫిట్గా ఉందని, సి-సెక్షన్ అవసరమని సంతకం కోసం వచ్చారు. ఇక అప్పుడే కరెంటు పోయింది. అయితే ఆ తర్వాత కూడా మమ్మల్ని వేరే హాస్పిటల్కి పంపలేదు. పైగా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి ఫోన్ టార్చ్ సహాయంతో డెలివరీ చేశారు. బిడ్డ చనిపోయిందని మేము కేకలు వేస్తే.. తల్లి క్షేమంగా ఉంటుందని డాక్టర్ చెప్పారు. తర్వాత సియోన్ ఆసుపత్రికి రిఫర్ చేశారు, కానీ అప్పటికే ఆమె చనిపోయింది. ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదు’ అని కనీటిపర్యంతమైంది. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించి తల్లీబిడ్డల ప్రాణాలు పోవడానికి బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అన్సారీ కోరాడు. అలాగే ఆసుపత్రిని మూసివేయాలని కూడా డిమాండ్ చేశారు. మరి, సెల్ టార్చ్ లైట్ లో గర్భిణీ కి సర్జరీ చేసి తల్లిబిడ్డ ప్రాణాలు తీసేసిన వైద్యుల నిర్లక్ష్యం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.