iDreamPost
android-app
ios-app

PM Modi: గుజరాత్​పై ప్రధాని మోడీ వరాల జల్లు.. ఏకంగా రూ.8 వేల కోట్ల ప్రాజెక్ట్స్!

  • Published Sep 16, 2024 | 5:48 PM Updated Updated Sep 16, 2024 | 5:48 PM

PM Modi Inaugurates Vande Metro In Gujarat: ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్​ మీద వరాల జల్లు కురిపించారు. ఆ రాష్ట్రానికి భారీ ప్రాజెక్ట్​లను గిఫ్ట్​గా ఇచ్చారు. ఏంటా ప్రాజెక్టులు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

PM Modi Inaugurates Vande Metro In Gujarat: ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్​ మీద వరాల జల్లు కురిపించారు. ఆ రాష్ట్రానికి భారీ ప్రాజెక్ట్​లను గిఫ్ట్​గా ఇచ్చారు. ఏంటా ప్రాజెక్టులు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Sep 16, 2024 | 5:48 PMUpdated Sep 16, 2024 | 5:48 PM
PM Modi: గుజరాత్​పై ప్రధాని మోడీ వరాల జల్లు.. ఏకంగా రూ.8 వేల కోట్ల ప్రాజెక్ట్స్!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన సొంతరాష్ట్రం గుజరాత్ మీద వరాల జల్లు కురిపించారు. భారీ ప్రాజెక్టులను ఆ రాష్ట్రానికి ఆయన బహుమతిగా ఇచ్చారు. గుజరాత్ పర్యటనలో ఉన్న మోడీ ఇవాళ చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏకంగా రూ.8 వేల కోట్ల ప్రాజెక్ట్స్​ను ఆయన గిఫ్ట్​గా ఇచ్చారు. దేశ మొట్టమొదటి వందే మెట్రోను స్టార్ట్ చేశారు. భుజ్ నుంచి అహ్మదాబాద్ వరకు నడిచే ఈ మెట్రోను ఆయన జెండా ఊపి మొదలుపెట్టారు. ఈ వందే మెట్రోకు ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్​’గా నామకరణం చేశారు. అంతేకాదు గుజరాత్ రాజధాని అహ్మదాబాద్​లో మరిన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారాయన. ఈ టూర్ కోసం నిన్న సాయంత్రం అహ్మదాబాద్​కు చేరుకున్న మోడీ.. ఇవాళ మొదట వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత వందే మెట్రోను స్టార్ట్ చేశారు. ఇంకా ఆయన ఏమేం చేశారు? గుజరాత్​లో ఆయన ప్రారంభించిన భారీ ప్రాజెక్టులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

వందే భారత్​ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఆ తర్వాత అహ్మదాబాద్​ మెట్రో రైల్ ఎక్స్​టెన్షన్ ప్రాజెక్ట్​ ఫేజ్-2ను మొదలుపెట్టారు. గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ (జీఎంఆర్సీ), గుజరాత్ రాష్ట్ర సర్కారుతో కలసి ఈ ప్రాజెక్ట్​ను డెవలప్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్​, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​తో కలసి మెట్రో రైలులో ప్రయాణించారు మోడీ. సెక్షన్ 1 నుంచి గిఫ్ట్ సిటీ వరకు ఆయన ట్రావెల్ చేశారు. ఈ మెట్రో రైల్ ఎక్స్​టెన్షన్ ప్రాజెక్ట్​కు అయిన మొత్తం వ్యయం రూ.5,384 కోట్లు. ఈ ప్రాజెక్ట్​కు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు ఫ్రాన్స్​లోని ఏఎఫ్​డీ, జర్మనీలోని కేఎఫ్​డబ్ల్యూ లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి లోన్స్ ద్వారా అవసరమైన నిధులు సమకూరాయి.

అహ్మదాబాద్​లో మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు మోడీ. అక్కడి 30 మెగావాట్ల సోలార్ సిస్టమ్​ను ఇవాళే స్టార్ట్ చేయనున్నారు. అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ కింద 30 వేలకు పైగా ఇళ్లను ఆమోదించనున్నారు. ఈ స్కీమ్​లోని ఇళ్లలో తొలి విడతకు సంబంధించినవి విడుదల చేయనున్నారు. పీఎంఏవై పథకం కింద ఇళ్ల నిర్మాణాలను కూడా సోమవారమే ప్రారంభించనున్నారు మోడీ. వీటితో పాటు సమాఖియాలీ-గాంధీధామ్, గాంధీధామ్-ఆదిపూర్ రైల్వే లైన్లను మొదలుపెట్టనున్నారు. ఏఎంసీ, అహ్మదాబాద్ రోడ్లను ప్రారంభించడంతో పాటు బక్రోల్, హాతీజన్, రామోల్, పంజర్​పోల్ జంక్షన్స్​లో నూతనంగా నిర్మించనున్న ఫ్లైఓవర్స్​కు శంకుస్థాపన చేయనున్నారు. ఇలా మొత్తంగా ఒకే పర్యటనతో గుజరాత్​లో భారీగా అభివృద్ధి కార్యక్రమాలను ఆయన మొదలుపెడుతున్నారు. మరి.. గుజరాత్​ మీద మోడీ భారీగా వరాల జల్లు కురిపించడం, రూ.8 వేల కోట్లను బహుమతిగా ఇవ్వడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.