వీడియో: క్షమాపణలు చెప్పిన నీతా అంబానీ.. ఎందుకంటే..!

Nita Ambani: ప్రపంచ కుబేరుడు ముఖేష్‌ అంబానీ చిన్న కొడుకు.. అనంత్‌ అంబానీ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేడుకల్లో చివరి రోజైన మంగళ ఉత్సవ్ కార్యక్రమం తరువాత నీతా అంబానీ క్షమాపణలు చెప్పారు. మరి.. ఎందుకు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

Nita Ambani: ప్రపంచ కుబేరుడు ముఖేష్‌ అంబానీ చిన్న కొడుకు.. అనంత్‌ అంబానీ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేడుకల్లో చివరి రోజైన మంగళ ఉత్సవ్ కార్యక్రమం తరువాత నీతా అంబానీ క్షమాపణలు చెప్పారు. మరి.. ఎందుకు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

దేశంలోనే అత్యంత కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ముగిశాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ఘనంగా జరిగింది. ప్రపంచంలోని అతిరథులందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. దీంతో అనంత్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. జులై 12న అనంత్ రాధికతో కలిసి ఏడడుగులు వేశారు. పెళ్లి తర్వాత రోజు ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుక, ఆదివారం జరిగిన ‘మంగల్ ఉత్సవ్’ కార్యక్రమాలతో పెళ్లి వేడుకలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో చివరిరోజైన నిన్న మంగళ ఉత్సవ్ వేడుకలో నీతా అంబానీ మీడియాతో మాట్లాడారు. అందరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె అందరికీ క్షమాపణ చెప్పింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఆమె ఎందుకు క్షమాణపు చెప్పారో, ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఆసియా కుబేరుడు ముఖేష్‌ అంబానీ చిన్న కొడుకు.. అనంత్‌ అంబానీ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రెండు రోజుల క్రితం అనగా జూలై 12, శుక్రవారం నాడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు మన దేశం నుంచే కాక.. విదేశాల నుంచి కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు తరలి వచ్చారు. ఇక పెళ్లి వేడుకల్లో చివరి రోజైన మంగళవారం మంగళ ఉత్సవ్ వేడుకలు ఘనంగా జరిగాయి. పెళ్లి వేడుకల అనంతరం ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ మీడియాతో ముందు మాట్లాడారు. ఈ సందర్భాగా ఆమె మాట్లాడూ… తన కుమారుడి పెళ్లికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఆమె తెలిపారు. అంతేకాక ఏదైనా తప్పులు ఉంటే, దయచేసి క్షమించాలని వినయంగా రెండు చేతులు జోడించి మీడియాను కోరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నీతా మాట్లాడిన విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నీతా అంబానీ డౌన్ టూ ఎర్త్ అని, అంత డబ్బున్న అహంకారం లేదని కొనియాడుతున్నారు. ఇక పెళ్లి వేడుకల ముగింపు కార్యక్రమంలో నీతా అంబానీ పింక్ కలర్ చీర కట్టుకుని కనిపించారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వెడ్డింగ్ రిసెప్షన్ మరోసారి  ప్రముఖులతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. గోవింద్ బాబీ డియోల్, సన్నీ డియోల్ సహా అనేక మంది పాల్గొన్నారు. మొత్తంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మొత్తంగా నీతా అంబానీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్  రూపంలో తెలియజేయండి.

Show comments