నేపాల్‌: నదిలో పడిన బస్సు.. అందులో 40 మంది భారతీయులు!

Nepal Bus Accident, Marsyangdi River, Tanahun District: 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. నదిలో పడిపోయిన ఘటన నేపాల్‌లో చోటు చేసుకుంది. అందులో ఉన్నవారంతా భారతీయులే అని ప్రాథమిక సమాచారం.

Nepal Bus Accident, Marsyangdi River, Tanahun District: 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. నదిలో పడిపోయిన ఘటన నేపాల్‌లో చోటు చేసుకుంది. అందులో ఉన్నవారంతా భారతీయులే అని ప్రాథమిక సమాచారం.

ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్‌లోని తనహున్ జిల్లాలో గల మర్స్యంగ్డి నదిలో బస్సు పడిపోయింది. దాదాపు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న భారత్‌కు చెందిన బస్సు శుక్రవారం ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. అందులో ఉన్నవారంతా భారతీయులే. బస్సు ఉత్తర ప్రదేశ్‌కు చెందిందిగా సమాచారం. బస్సు నంబర్‌.. ‘UP FT 7623’గా పోలీసులు గుర్తించారు. నదిలో పడిన బస్సు పై టాప్‌ అంతా ఊడిపోయింది. సీట్లు కనిపిస్తున్న బస్సు.. నది ఒడ్డకు కొట్టుకు వచ్చినట్లు తనహున్ పోలీస్‌ అధికారి దీప్‌కుమార్ రాయ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Show comments