ముకేశ్ అంబానీ ఇంట కేఫ్‌ యజమానికి అపూర్వ గౌరవం!

Mysore Café Owner: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ - రాధిక మర్చంట్‌ వివాహ వేడుక అంబారన్నంటిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకలో ఓ కేఫ్ యాజమానికి అపూర్వ స్వాగతం లభించింది.

Mysore Café Owner: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ - రాధిక మర్చంట్‌ వివాహ వేడుక అంబారన్నంటిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకలో ఓ కేఫ్ యాజమానికి అపూర్వ స్వాగతం లభించింది.

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇంట వివాహ వేడుకలు జరిగిన సంగతి తెలిసింది. ఆయన చిన్న కుమారుడు కుమారుడు అనంత్‌ అంబానీ – రాధిక మర్చంట్‌ వివాహ వేడుక అంబారన్నంటింది. ఈ క్రమంలోనే మీడియా, సోషల్‌ మీడియా ఇలా ఎక్కడ చూసినా వీరిద్దరి మర్చంట్‌ల పెళ్లికి సంబంధించిన వార్తలే ట్రెండింగ్‌లో ఉన్నాయి. జూలై 12, శుక్రవారం నాడు అనంత్‌ అంబానీ పెళ్లి జరిగిన సంగతి తెలిసింది. ప్రపంచంలోని, దేశంలోని ప్రముఖులందరూ హాజరయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన ప్రతిది నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ఇదే సమయంలో ఓ కేప్ ఓనర్ కి అపూర్వ గౌరవం లభించింది.

ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ వివాహానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు వచ్చారు. నూతన జంటకు తమ ఆశీర్వదాలు అందించారు. అలా అంబానీ ఇంట పెళ్లికి వచ్చిన ప్రముఖుల్లో శాంతేరి నాయక్‌ ఒకరు. పెళ్లి వేడుకలో ఆమెను చూడగానే అనంత్‌ చాలా సంతోష పడటమే కాకుండా ఆప్యాయంగా పలకరించారు. తన భార్య రాధికను పిలిచి శాంతేరి నాయక్ వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ముంబయిలోని ప్రముఖ రెస్టారంట్‌ ‘మైసూర్‌ కేఫ్‌ యజమానే శాంతేరి నాయక్‌. ప్రస్తుతం ఈమె గురించి తెలుసుకునేందుకు అందరూ తెగ సెర్చ్ చేస్తున్నారు.

అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకలో అతిథుల కోసం అద్భుతమైన విందును ఏర్పాటు చేశారు. పంజాబీ, గుజరాతీ, కశ్మీరీతో ఇతర ప్రాంతాల రుచులను విందులో ఏర్పాటు చేశారు. వీటితో పాటు విదేశీ రుచులతో కలిపి దాదాపు 2500లకు పైగా వంటకాలను అంబానీ పెళ్లిలో వడ్డించారు. ఇందులో అంబానీ కుటుంబానికి ఎంతో ఇష్టమైన ‘మైసూరు కేఫ్‌’ రుచులు మరింత ప్రత్యేకం.  అందుకే ఈ కేఫ్‌ యజమాని శాంతేరి నాయక్ ను ని కూడా పెళ్లికి ఆహ్వానించారు. ఆమెను ముకేశ్ అంబానీ దంపతులు ఆప్యాయంగా స్వాగతించారు.  ఇక నూతన దంపతులు ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రతి సండే  తమ ఇంట్లో అందరం మైసూరు కేఫ్ భోజనమే తింటున్నాంమనిని రాధిక ఆమెతో అనడం వీడియోలో కన్పించింది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments