Online Scams : ఆన్లైన్ లో డబ్బులు పోతున్నాయి జాగ్రత్త, ఏకంగా 7.66 కోట్లు దోచేశారు

Online Scams : ఆన్లైన్ లో డబ్బులు పోతున్నాయి జాగ్రత్త, ఏకంగా 7.66 కోట్లు దోచేశారు

ఆన్లైన్ లో మోసాలు పెరిగిపోతున్నాయి.. అటు పోలీస్ వాళ్ళు ఇటు బ్యాంకు వాళ్ళు పబ్లిక్ అవేర్నెస్ కోసం చాలా వీడియోస్ రిలీజ్ చేస్తున్నా సరే .. సైబర్ నేరగాళ్ల ట్రాప్ లో పడి కోట్ల రూపాయలు పోగోట్టుకుంటున్నారు . తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన చోటుచేసుకుంది.

ఆన్లైన్ లో మోసాలు పెరిగిపోతున్నాయి.. అటు పోలీస్ వాళ్ళు ఇటు బ్యాంకు వాళ్ళు పబ్లిక్ అవేర్నెస్ కోసం చాలా వీడియోస్ రిలీజ్ చేస్తున్నా సరే .. సైబర్ నేరగాళ్ల ట్రాప్ లో పడి కోట్ల రూపాయలు పోగోట్టుకుంటున్నారు . తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన చోటుచేసుకుంది.

రోజు రోజుకు ఆన్లైన్ లో మోసాలు పెరిగిపోతున్నాయి.. అటు పోలీస్ వాళ్ళు ఇటు బ్యాంకు వాళ్ళు పబ్లిక్ అవేర్నెస్ కోసం చాలా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు అయినా కూడా చాలా మంది సైబర్ నేరగాళ్ల ట్రాప్ లో పడి కోట్లకి కోట్లు పోగోట్టుకుంటున్నారు. రోజుకొక కొత్త టెక్నిక్ తో వస్తున్న సైబర్ నెరగాళ్లుని ఎదురుకోవడం పోలీస్ వాళ్ళకి కూడా పెద్ద ఛాలెంజ్ లా మారింది. రీసెంట్ గా ఒక కేరళ వ్యక్తి దగ్గర ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 7.66 కోట్లు దోచేశారు.

అసలు ఈ ఆన్లైన్ ఫ్రాడ్ ఎలా జరిగింది అంటే. కేరళలో యంగ్ బిజినెస్ మ్యాన్. అతనకి ఒక కొత్త నెంబర్ నుండి కాల్ వచ్చింది. ‘ఇన్వెస్కో క్యాపిటల్ అండ్‌ గోల్డ్‌మన్ స్టాక్స్’ నుండి కాల్ చేస్తున్నాం అని, మేము ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తాం అని, ఎక్కువ రిటర్న్స్ రావడం కోసం ఎందులో మనీ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనే గైడెన్స్ ఇస్తామని చెప్పారు. తన మాటలు నమ్మిన ఆ బిజినెస్ మ్యాన్. స్టార్టింగ్లో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. వాటికి మంచి రిటర్న్స్ రావడంతో, ఆ మోసగాడిని నమ్మడం మొదలు పెట్టాడు. అప్పటి నుండి ఇన్వెస్ట్మెంట్స్ ని ఇంకొంచం పెంచుకుంటూ వెళ్ళాడు. స్లోగా కొట్లలో రిటర్న్స్ వస్తున్నట్టు (39,72,85,929/- వచ్చినట్టు డాకుమెంట్స్ చూపించాడు). ఈ సారి స్కామర్ ఎక్కువ డబ్బులని ఇన్వెస్ట్ చెయ్యమన్నాడు.

కాని అప్పుడే ఆ బిజినెస్ మాన్ కి ఆ స్కామర్ మీద అనుమానం వచ్చి, ఆల్రెడీ కొట్లలో లాభాలు వచ్చాయి కాదా, వాటిని డ్రా చేద్దాం అని చూస్తే అప్పుడు ఇదంతా స్కాం అన్న విషయం అతనికి అర్ధం అయ్యింది. దాదాపుగా 7.66 కోట్లు అప్పటికే ఇవేస్ట్ చేశాడు. అయినా కుడా వాళ్ళిద్దరూ ఒక్క సారి కూడా కలవలేదు. డబ్బులు రాకపోయే సరికి బిజినెస్ మ్యాన్ చాలా సార్లు కాంటాక్ట్ చెయ్యడం మొదలు పెట్టాడు. కాని అవతల పక్క నుండి రెస్పాన్స్ రావడం లేదు. ఇంకా తాను మోసపోయిన విషయం అర్ధం చేసుకున్న బిజినెస్ మ్యాన్ వెంటనే పోలీసులకి కంప్లైంట్ చేశాడు.

అనుపం ఖేర్, రీమా సేన్ లాంటి పబ్లిక్ ఫిగర్స్ కూడా ఆన్లైన్ లో మోసపోయారు. పోలీసులు ఇంకా సైబర్ సెక్యూరిటీ వాళ్ళు కూడా తెలియని వ్యక్తుల సలహా విని ఇన్వెస్ట్మెంట్ చెయ్యొద్దు అని అవేర్నేస్స్ కల్పిస్తున్నారు. అలాగే ఆన్లైన్ లో డబ్బులకి సంబంధించి ఎటు వంటి ట్రాన్సాక్షన్ అయినా కూడా అస్సలు ముందూ వెనక ఆలోచించకుండా, ఎవరో చెప్పిన మాట విని చోయ్యోద్దు అని. అలానే అసలు డబ్బులు గురించి మీకు తెలియని వ్యక్తి నుండి వచ్చే ఏ మాటని అయినా కూడా పట్టించుకోకండి అని పోలీసులు చెప్తున్నారు.

Show comments