iDreamPost
android-app
ios-app

సెల్పీ సరదా.. 2వేల అడుగుల లోతున్న లోయలోపడ్డ యువకుడు

  • Published Jul 24, 2023 | 1:24 PM Updated Updated Jul 24, 2023 | 1:24 PM
  • Published Jul 24, 2023 | 1:24 PMUpdated Jul 24, 2023 | 1:24 PM
సెల్పీ సరదా.. 2వేల అడుగుల లోతున్న లోయలోపడ్డ యువకుడు

పర్యాటక ప్రాంతమైన మహారాష్ట్రలోని అజంతా గుహలకు వెళ్లిన ఓ యువకుడి సెల్ఫీ సరదా అతని ప్రాణాల మీదకు తెచ్చింది. సెల్ఫీకి ఫోజులిచ్చుకుంటూ లోయ అంచుకు వెళ్లిన ఆ యువకుడు ప్రమాదవశాత్తు కాలు జారి దాదాపు 2 వేల అడుగుల లోతున్న లోయలో పాడిపోయాడు. దీంతో అంతా అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయానని ఆశలు వదులుకున్నారు. కానీ, అతని స్నేహితులు మాత్రం వెంటనే వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కానీ, 2 వేల అడుగుల లోతు అంటే మామూలు విషయం కాదు. దీంతో అతన్ని కాపాడేందుకు పోలీసులు ఎంతో శ్రమించారు. అసలు అతని బతికే ఉన్నాడా లేదా అనే విషయం కూడా వారికి తెలియదు. కానీ, చిన్న ఆశతో అతన్ని కాపాడేందుకు పూనుకున్నారు.

స్నేహితుల ప్రార్థనలు, పోలీసుల ప్రయత్నంతో చివరి ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. 2 వేల అడుగుల లోతున్న లోయలో పడినా ఆ యువకుడు ఎలా బతికి ఉన్నాడనే డౌన్‌ రావచ్చు. ఆ యువకుడికి ఈత రావడంతో.. నీళ్లలో పడిన తర్వాత కొట్టుకోపోకుండా అక్కడే ఒక బండరాయిని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. పోలీసులు భారీ తాళ్లను లోయలోకి వదిలిన తర్వాత వాటిని పట్టుకుని పైకి వచ్చాడు. అతన్ని కాపాడిన దృశ్యాలను అక్కడి వారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్‌ మీడియోలో వైరల్‌గా మారాయి. మరి రెండు వేల అడుగుల లోతున్న లోయలో పాడి కూడా అతను బతికి ఉన్నాడంటే ఆ యువకుడికి ఇంకా ఈ భూమి మీద నూకలు ఉన్నాయంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నడి రోడ్డుపై రెచ్చిపోయిన యువకులు.. సైకోలను మించిపోయారు!