iDreamPost
android-app
ios-app

విషాదం: 8 నెలల చిన్నారి ప్రాణం తీసిన ఫోన్ ఛార్చర్!

విషాదం: 8 నెలల చిన్నారి ప్రాణం తీసిన ఫోన్ ఛార్చర్!

ఇప్పుడు ఫోన్ లేని ఇల్లు ఉండదేమో అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందరి ఇళ్లల్లో ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్లు నడవాలి అంటే కచ్చితంగా దానికి ఛార్జింగ్ పెట్టాలి. అయితే చాలా మంది ఫోన్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత చాలా మంది స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోతారు. కొంతమంది కావాలని కూడా స్విచ్ ఆఫ్ చేయరు. కానీ, ఈ వార్త చదివిన తర్వాత మీరు స్విచ్ ఆపడం అస్సలు మర్చిపోరు. ముఖ్యంగా పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే ఛార్జింగ్ పెట్టిన తర్వాత కచ్చితంగా స్విచ్ ఆఫ్ చేస్తారు. ఎందుకంటే అలా ఆపడం మర్చిపోయిన తల్లిందండ్రుల వల్ల ఓ 8 నెలల చిన్నారి ప్రాణం పోయింది కాబట్టి.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఉత్తర కర్ణాటక జిల్లా కర్వార్ తాలూకా సిద్ధార్ ప్రాంతంలో జరిగింది. అక్కడ నివసించే సంతోష్ కల్గుటక్కర్, సంజనా దంపతులకు 8 నెలల కుమార్తె ఉంది. ఆ చిన్నారి ఇంట్లో ఉన్న ఛార్జర్ పిన్ తో ఆడుకుంటోంది. అయితే ఆ సమయంలో ఛార్జర్ స్విచ్ ఆన్ లోనే ఉండటం వల్ల చిన్నారి నోట్లో పెట్టుకోగానే ఆమెకు షాక్ తగిలింది. ఆ పిన్ ద్వారా కరెంట్ పాసై ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అది గమనించిన తల్లిదండ్రులు ఆమెను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే పాప ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యుల ధ్రువీకరించారు. కూతురి మరణం చూసి ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు.

వారి నిర్లక్ష్యం కారణంగా తమ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది అని కుమిలిపోయాడు. అతను ఒక్కసారిగా కుప్పకూలి అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు సంతోష్ ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. కాగా.. సంతోష్- సంజనా దంపతులకు మొత్తం ముగ్గురు సంతానం అని చెబుతున్నారు. ఇప్పుడు మరణించిన సంధ్య చిన్న కుమార్తె అని పోలీసులు తెలిపారు. అయితే బుధవారం మరో కుమార్తె పుట్టిన రోజని చెప్పారు. కుమార్తె పుట్టిన రోజని ఎంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో చిన్న కుమార్తె మరణంతో విషాదం నెలకొంది. ఈ వార్త తెలుసుకుని స్థానికులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు.