iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో..

  • Published Oct 05, 2024 | 10:32 AM Updated Updated Oct 05, 2024 | 10:32 AM

Actor Rajendra Prasad daughter passed away: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.

Actor Rajendra Prasad daughter passed away: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో..

ఇటీవల పలువురు సినీ సెలబ్రిటీలు అనారోగ్య కారణాలు, గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు. నిత్యం వ్యాయామం చేస్తూ, పౌష్టికాహారం తీసుకుంటూ ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ సినీ ప్రముఖులను హార్ట్ ఎటాక్ బెంబేలెత్తిస్తోంది. ఈ క్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు గద్దె గాయత్రి కన్నుమూశారు. 38 ఏళ్ల వయసున్న గద్దె గాయత్రి శుక్రవారం గుండెపోటుకు గురైయ్యారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను గచ్చిబౌళిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించిపోయింది. దీంతో గాయత్రి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఒక్కగానొక్క కూతురు మరణించడంతో రాజేంద్రప్రసాద్ శోకసంద్రంలో మునిగిపోయారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కన్నుమూయడంతో ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే గుండెపోటుకు గురై లోకాన్ని విడిచి వెళ్లడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గాయత్రి మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ ను పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. కాగా రాజేంద్రప్రసాద్ కు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న సంగతి తెలిసిందే.