ఆదిపై ఇంద్రజ ఫైర్..నోటి దూల తగ్గించుకోవాలంటూ వార్నింగ్

Sridevi Drama Company: ఎప్పటిలానే శ్రీదేవి డ్రామా కంపెనీ షో నుంచి లెటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో జబర్ధస్త్ ఫేమ్ ఆదిపై నటి ఇంద్రజ సీరియస్ అయ్యి వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాలేంటో చూద్దాం.

Sridevi Drama Company: ఎప్పటిలానే శ్రీదేవి డ్రామా కంపెనీ షో నుంచి లెటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో జబర్ధస్త్ ఫేమ్ ఆదిపై నటి ఇంద్రజ సీరియస్ అయ్యి వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాలేంటో చూద్దాం.

వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రేక్షకులు సినిమాలైన ఆసక్తిగా చూస్తారమో తెలియదు కానీ, బుల్లితెర పై ప్రసారమైన పాపులార్ ఎంటర్టైన్మెంట్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రం అసలు మిస్ చేయకుండా చూస్తారు. అంతలా బుల్లితెరపై ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. ముఖ్యంగా ఈ షోలో ఆర్టిస్టులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ.. తమదైన డ్యాన్స్ లు, స్కిట్ లతో ఆడియోన్స్ ను వినోదంలో ముంచెత్తుంటారు. అలాగే ఈ షోలో జడ్జిగా వ్యవహారించిన ఇంద్రజ కూడా తనదైన స్టయిల్లో చేసే కామెడీ, డాన్స్, యాక్షన్ తో ఆకట్టుకుంటారు. ఇకపోతే ఈ షోకు యాంకర్ చేస్తున్న రష్మీ కూడా తనదైన అందం, యాంకరింగ్, డ్యాన్స్ లతో అందర్నీ అలరిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి వీక్ ప్రోమో విడుదల చేస్తారనే విషయం తెలిసిందే. ఇక ఎప్పటిలానే ఈ వారంకు సంబంధించిన లెటెస్ట్ ప్రోమో కూడా రిలీజైంది. అయితే ఈ ప్రోమోలో జబర్ధస్త్ ఫేమ్ ఆదిపై నటి ఇంద్రజ సీరియస్ అయ్యి వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాలేంటో చూద్దాం.

బుల్లితెర ఎంటర్టైన్మెంట్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఈ సెప్టెంబర్ 8కి ప్రసారమయ్యే షో లెటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో ఎప్పటిలా కాకుండా.. మొదటిగా జబర్ధస్త్ ఆది ఎంట్రీ ఇస్తూ.. తనదైన డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. అలాగే అతని ఎంట్రీ తర్వాత ప్రముఖ సీరియల్ ఆర్టిస్టు భావనతో పాటు మరీ కొందరు సీరియల్ నటులు ఎంట్రీ ఇస్తూ.. ఆదితో పంచ్ లు వేస్తూ తమదైన డైలాగ్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇక ఆ తర్వాత.. ఈ షోలో మిగిలిన సీరియల్, జబర్ధస్త్ ఆర్టిస్టులు తో పాటు నటి ఇంద్రజ, యాంకర్ రష్మీ తో పాటు హీరో  రాజ్ తరుణ్, సుహాస్ ఎంట్రీ ఇస్తారు. అయితే ఈ షోలో ఎప్పటిలానే ఆర్టిస్టులు తమదైన డ్యాన్స్ లు, స్కిట్స్ , టాస్క్ లతో అలరిస్తుంటారు.కానీ, ఇంతలోనే ఆ షోలో ఓ లేడీ జబర్ధస్త్ ఆర్టిస్ట్ ఆదిని చెల్లిగా నేను ఫస్ట్ టైమ్ చేస్తున్న కదా ఆది గారు ఎలా ఉంది అని అడిగారు. ఇక ఆ ప్రశ్నకు ఆది ఇప్పుడు దీని వల్ల ఏమి ఉపాయోగం అంటూ బదులిచ్చారు.

అయితే ఆది చేసిన వ్యాఖ్యలకు ఇంద్రజ బదులిస్తూ.. ”ఇప్పుడు మీరు ఇలా అడిగినందుకు ఏమి ఉపాయోగం.. నోరు మూసుకోని నోటి దూల తగ్గించుకొని కూర్చుంటే మంచిది” అంటూ ఇంద్రజ ఆదికి వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఈ సీన్ హైలెట్ గా నిలివడమే కాకుండా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే చివరిగా ఈ ప్రోమోలో సీరియల్ ఆర్టిస్ట్ భావన కొలుకత్త డాక్టర్ ఘటనకు సంబంధించి స్కిట్ చేసి అందర్నీ భావోద్వోగానికి గురి చేశారు. కాగా, ఈ స్కీట్ కు ఇంద్రజతో పాటు ఆది పలువురు కంటెస్టెంట్స్ కంటతడి పెట్టారు. మరీ ప్రస్తుతం ఆదిపై ఇంద్రజ సీరియస్ అవుతూ వార్నింగ్ ఇవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments