పల్లవి ప్రశాంత్‍పై షకీలా షాకింగ్ కామెంట్స్.. అతడు అలాంటి వాడు అంటూ

Shakeela Fire on Pallavi Prashanth స్మాల్ స్క్రీన్ పై ఎంటర్ టైన్ మెంట్ షో అనగానే టక్ మని గుర్తుకు వచ్చేది బిగ్ బాస్. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుని.. ఎనిమిదో సీజన్ కు రెడీ అవుతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై షకీలా షాకింగ్ కామెంట్స్ చేసింది.

Shakeela Fire on Pallavi Prashanth స్మాల్ స్క్రీన్ పై ఎంటర్ టైన్ మెంట్ షో అనగానే టక్ మని గుర్తుకు వచ్చేది బిగ్ బాస్. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుని.. ఎనిమిదో సీజన్ కు రెడీ అవుతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై షకీలా షాకింగ్ కామెంట్స్ చేసింది.

బుల్లితెరపై ఎంటర్ టైన్ మెంట్‌కు కొదవ లేదు. సీరియల్స్, సినిమాలతో పాటు స్పెషల్ ప్రోగ్రామ్స్ అలరిస్తుంటాయి. జబర్థస్త్ వంటి కామెడీ షోలతో పాటు డ్యాన్స్ షో, గేమ్ షోస్ ఆకట్టుకుంటున్నాయి. అయితే రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో ప్రసారం అవుతుంది. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఆరు ఎపిసోడ్లను రాని హైన్ ఏడవ సీజన్‌కు వచ్చింది. ఉల్టా-పల్టా అంటూ సరికొత్తగా గేమ్ డిజైన్ చేయగా.. సామాన్యుడు, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్ అయ్యాడు. గెలిచి బయటకు వచ్చాక.. పోలీసుల ఆంక్షలు బేఖాతరు చేస్తూ చేపట్టిన ర్యాలీతో అభాసు పాలై.. అరెస్టు అయ్యాడు. ఇక సినిమాల్లో హీరోగా నటించబోతున్నాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ రైతు బిడ్డ వీడియోలతో హవా కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే..పల్లవి ప్రశాంత్ పై నటి, బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్లలో ఒకరైన షకీలా షాకింగ్ కామెంట్స్  చేసింది. బిగ్ బాస్‌లో రెండు వారాల పాటు ఉంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది.‘ బిగ్ బాస్ హౌస్‌లో నేను ఉన్నప్పుడు నాకు సందీప్, ప్రియాంక, అమర్ దీప్ , దామిని నిజాయితీగా అనిపించారు. నాకు ఎక్కడ తప్పులు కనిపించలేదు. వారి కంట్లో నిజాయితీ కనిపించింది. అలాగే శివాజీ న్యూట్రల్ పర్సన్. ఆయనను జడ్జ్ చేయలేను. టేస్టీ తేజ్ కుట్టి పయ్య. నా గుడ్డు తినేసేవాడు. అమ్మ అటు చూడు అంటూ లటుక్కున తినేసేవాడు’ అని పేర్కొంది.

పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ.. ‘పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ నాపై కోపం ప్రదర్శించిన ఐ డోంట్ కేర్.. అతను బిగ్ బాస్ హౌస్‌లోకి వినయంగా నటించాడు. సీనియర్ ఆర్టిస్టులకు గౌరవం ఇవ్వలేదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా నటించాడు. పెద్దవాళ్ళు, సీనియస్ ఉన్నారు కూడా మర్యాద ఇవ్వకుండా కాలు మీద కాలేసుకుని కూర్చోనేవాడు. అతడు జెన్యూనా, ఫేకా అనే విషయాన్ని పక్కన పెడితే.. పల్లవి ప్రశాంత్ యాటిట్యూడ్ నాకు నచ్చలేదు.కేవలం పేమెంట్ కోసమే నేను హౌస్‌లోకి వెళ్ళాను. పబ్లిసిటీ కోసమే వాళ్ళు నన్ను తీసుకున్నారు’ అని వెళ్లడించింది షకీలా. అలాగే బయటకు వచ్చాక చాలా తక్కువ మందికి మాత్రమే ఆఫర్లు వచ్చాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కూడా స్టార్ కానుంది. ఈ సమయంలో ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Show comments