iDreamPost
android-app
ios-app

లావణ్య ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్! చెప్పుతో కొట్టాక సీన్ మారిపోయింది!

  • Published Aug 02, 2024 | 9:00 AM Updated Updated Aug 02, 2024 | 9:00 AM

Raj Tarun: లాలీవుడ్ లో నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. పదేళ్లు తనతో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడని, పెళ్లి చేసుకొని ఇప్పుడు ఓ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని తనను దూరం చేస్తున్నాడని లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Raj Tarun: లాలీవుడ్ లో నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. పదేళ్లు తనతో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడని, పెళ్లి చేసుకొని ఇప్పుడు ఓ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని తనను దూరం చేస్తున్నాడని లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

లావణ్య ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్! చెప్పుతో కొట్టాక సీన్ మారిపోయింది!

గత నెల రోజుల నుంచి హీరో రాజ్ తరుణ్-లావణ్యల ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతుంది. తనను రాజ్ తరుణ్ పెళ్లి చేసుకొని పదేళ్లు కాపురం చేసి ఇప్పుడు ఓ హీరోయిన్ తో ఎఫైర్ నడిపిస్తూ తనను దూరం చేస్తున్నాడని అభియోగం మోపింది. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్-నటి మాల్వీ మల్హోత్ర ఆమె తమ్ముడిపై కేసు కూడా పెట్టింది. విశాఖలో ఉన్నపుడు రాజ్ తరుణ్ తనకు పరిచయం అయ్యాడని.. ఆ సమయంలో ఇద్దరం లివింగ్ రిలేషన్ లో ఉన్నామని.. రెండు సార్లు తనకు అబార్షన్ చేయించాడని..ఆ డబ్బు స్వయంగా రాజ్ తరుణ్ చెల్లించాడంటూ పలు ఎవిడిన్స్ లు పోలీసులకు సమర్పించింది లావణ్య. తనకు న్యాయం జరిగే వరకు కోర్టులో పోరాటం చేస్తా, ఫిలిమ్ ఛాంబర్ ముందు ధర్నా చేస్తా అంటూ హడావుడి చేస్తుంది. ఇదిలా ఉంటే లాణ్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాలో నెల రోజుల నుంచి హీరో రాజ్ తరుణ్- లావణ్య వివాదం సంచలనంగా మారింది. ఇండస్ట్రీలోకి రాకముందు రాజ్ తరుణ్ తనతో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడని.. పదేళ్ల పాటు తాము కలిసి ఉన్నామని లావణ్య చెబుతుంది. ఇటీవల రాజ్ తరుణ్ తనని దూరం పెడుతున్నాడని, తిరగబడరాసామి మూవీ హీరోయిన్ మాల్వీ మల్హోత్రతో ఎఫైర్ నడుపుతున్నాడని అభియోగం మోపింది. రాజ్ తరుణ్, మాల్వీ ఆమె సోదరుడు తనని డగ్ర్ కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేస్తుంది.తాను ప్రెగ్నెన్సీ అయితే రాజ్ తరుణ్ హాస్పిటల్ తీసుకు వెల్లి అబార్షన్ చేయించాడని ఖర్చు మొత్తం తనే పెట్టాడని, అతనితో ఉన్న ఫోటోలు,వీడియోలతో సహా పలు ఆధారాలు పోలీసులకు సమర్పించింది. మరోవైపు రాజ్ తరుణ్ మాత్రం లావణ్య చేసేవన్నీ ఆరోపణలే అంటూ కొట్టిపడేస్తున్నాడు.

Lavanya

ఇదిలా ఉంటే.. లావణ్యపై నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ం లో గురువారం ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి తమ ఇంటి వద్దకు వచ్చి దాడికి ప్రయత్నించిందని, కొంత కాలంగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే తమను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుందని.. తమను భయబ్రాంతులకు గురి చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై మాదాపూర్ సీఐ మాట్లాడుతూ.. ‘కాకతీయ హీల్స్ లో ఉంటున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మి గురువారం రాత్రి స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేశారని, లావణ్య ఇంటికి వచ్చి తలుపు కొడుతూ.. కేకలు వేసి న్యూసెన్స్ చేసిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారని’ అన్నారు. ఈ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇటీవల రాజ్ తరుణ్ పై లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.