iDreamPost
android-app
ios-app

NTR, చరణ్, బన్నీకి బిగ్ టార్గెట్ సెట్ చేసిన ప్రభాస్.. ముగ్గురిలో రీచ్ అయ్యేదెవరు?

  • Published Sep 14, 2024 | 6:30 AM Updated Updated Sep 14, 2024 | 6:30 AM

Prabhas Sets 1000 Crore Target For Jr NTR: ‘దేవర’తో బాక్సాఫీస్​ను ఊచకోత కోసేందుకు రెడీ అవుతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఆయన ముందు బిగ్ టార్గెట్ ఉంది. ప్రభాస్ ఇచ్చిన లక్ష్యాన్ని అందుకునే బాధ్యత తారక్​తో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్​పై కూడా ఉంది.

Prabhas Sets 1000 Crore Target For Jr NTR: ‘దేవర’తో బాక్సాఫీస్​ను ఊచకోత కోసేందుకు రెడీ అవుతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఆయన ముందు బిగ్ టార్గెట్ ఉంది. ప్రభాస్ ఇచ్చిన లక్ష్యాన్ని అందుకునే బాధ్యత తారక్​తో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్​పై కూడా ఉంది.

  • Published Sep 14, 2024 | 6:30 AMUpdated Sep 14, 2024 | 6:30 AM
NTR, చరణ్, బన్నీకి బిగ్ టార్గెట్ సెట్ చేసిన ప్రభాస్.. ముగ్గురిలో రీచ్ అయ్యేదెవరు?

‘దేవర’ సినిమాతో బాక్సాఫీస్​ను ఊచకోత కోసేందుకు రెడీ అవుతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చాన్నాళ్ల గ్యాప్ అనంతరం ఆయన నుంచి వస్తున్న మూవీ ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కడం, ఇప్పటివరకు చిత్రం నుంచి బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అదిరిపోవడంతో ‘దేవర’ మీద ఎక్స్​పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమాతో ఎన్టీఆర్ హిట్ కొడితే సరిపోదు.. ఆయన అందుకోవాల్సిన లక్ష్యాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సెట్ చేసినది. డార్లింగ్ ఇచ్చిన టార్గెట్​ను రీచ్ అవ్వాల్సిన బాధ్యత తారక్​తో పాటు మెగా పవర్​స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ మీద కూడా ఉంది. అసలు ఏంటా లక్ష్యం అనేది ఇప్పుడు చూద్దాం..

ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఎంత పెద్ద బ్లాక్​బస్టర్​గా నిలిచిందో తెలిసిందే. ఈ ఏడాది సమ్మర్​లో రిలీజైన ఈ ఫిల్మ్.. వరల్డ్ వైడ్​గా రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లతో సంచలన విజయం సాధించింది. ‘బాహుబలి’ సిరీస్​తో ఆల్రెడీ వెయ్యి కోట్ల కలెక్షన్స్ చూసిన ప్రభాస్.. మరోమారు ‘కల్కి’తో ఆ ఫీట్ అందుకొని రికార్డు క్రియేట్ చేశాడు. అదే సమయంలో చరణ్, బన్నీ, తారక్​కు రూ.1,000 కోట్ల టార్గెట్​ను సెట్ చేశాడు. ఈ ఏడాది ఈ మైల్​స్టోన్​ను అందుకునే అరుదైన అవకాశం వీళ్ల ముగ్గురికీ ఉంది. ఎన్టీఆర్ ‘దేవర’తో ఈ నెలలోనే ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. ఏడాది ఆఖర్లో చరణ్​ ‘గేమ్ ఛేంజర్’, అల్లు అర్జున్ ‘పుష్ప 2’తో బిగ్ స్క్రీన్స్​లో సందడి చేయనున్నారు. కాబట్టి వీళ్ల ముగ్గురిలో ఎవరు వెయ్యి కోట్ల క్లబ్​లో అడుగు పెడతారనేది ఆసక్తికరంగా మారింది.

చరణ్-తారక్ ఆల్రెడీ 1,000 కోట్ల కలెక్షన్స్ చూశారు. ‘ఆర్ఆర్ఆర్’తో ఆ ఫీట్​ను అందుకున్నారు. కానీ అది మల్లీస్టారర్ కావడం, ఎక్కువ క్రెడిట్ దర్శకధీరుడు రాజమౌళి ఖాతాలోకి వెళ్లిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్లు పాన్ ఇండియా స్టేటస్​ను మరింత బలోపేతం చేసుకోవాలంటే సోలోగా వచ్చి వెయ్యి కోట్ల మార్క్​ను అందుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బన్నీ ఆల్రెడీ ‘పుష్ప’తో సౌత్​తో పాటు హిందీ మార్కెట్​నూ షేక్ చేశాడు. అయితే ఆ మూవీ సెకండ్ పార్ట్​తో మరింత సౌండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టిన మాదిరిగా కలెక్షన్స్ జాతర చేయాలి. ఈ ముగ్గురు హీరోలు వెయ్యి కోట్ల క్లబ్​లోకి అడుగుపెడితే టాలీవుడ్ ప్రతిష్ట మరింత పెరగడం ఖాయం. మూడ్నెళ్ల గ్యాప్​లో మూడు థౌజండ్ క్రోర్ ఫిల్మ్స్ ఒకే ఇండస్ట్రీ నుంచి పడితే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్​లో ఉంటుంది. ముందు ‘దేవర’ నుంచే ఆ ప్రయత్నం మొదలవ్వాలని ఆడియెన్స్ కోరుకుంటున్నారు. మరి.. ప్రభాస్ టార్గెట్​ను తారక్, చరణ్​, బన్నీ రీచ్ అవుతారా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.