iDreamPost
android-app
ios-app

పొలిమేర-2 నిర్మాతల మధ్య వివాదం.. ఏం జరిగిందంటే?

  • Published Jul 16, 2024 | 1:05 PM Updated Updated Jul 16, 2024 | 1:05 PM

టాలీవుడ్ లో తాంత్రిక విద్యలు, చేతబడి కాన్సెఫ్ట్ తో తెరకెక్కిన సినిమాల్లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా పొలిమేర. ఇక ఈ మూవీ పార్ట్ 1, 2 ఎంత పెద్ద హిట్ టాక్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ మూవీ నిర్మాతల మధ్య పెద్ద వివాదం జరిగింది. ఇక ఆ వివాదం పోలీసు స్టేషనులో ఫిర్యాదు వరకు వెళ్లింది. ఇంతకి ఏం జరిగిందంటే..

టాలీవుడ్ లో తాంత్రిక విద్యలు, చేతబడి కాన్సెఫ్ట్ తో తెరకెక్కిన సినిమాల్లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా పొలిమేర. ఇక ఈ మూవీ పార్ట్ 1, 2 ఎంత పెద్ద హిట్ టాక్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ మూవీ నిర్మాతల మధ్య పెద్ద వివాదం జరిగింది. ఇక ఆ వివాదం పోలీసు స్టేషనులో ఫిర్యాదు వరకు వెళ్లింది. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Jul 16, 2024 | 1:05 PMUpdated Jul 16, 2024 | 1:05 PM
పొలిమేర-2 నిర్మాతల మధ్య వివాదం.. ఏం జరిగిందంటే?

ఇప్పటి వరకు టాలీవుడ్ లో హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాల్లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా ‘మా ఊరి పొలిమేర’. ఈ సినిమాను తాంత్రిక విద్యలు, చేతబడి కాన్సెఫ్ట్ తో 2021లో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కామక్షి భాస్కర్ల, సత్యం రాజేష్, బాలదిత్య తదితరులు కీలక పాత్రలో నటించారు. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా అతి చిన్న సినిమాగా రిలీజైన పొలిమేర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో రెండో పార్టును ‘పొలిమేర-2’ గా ఏకంగా థియేటర్లలో రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమా రెండో భాగాన్ని గౌరి కృష్ణప్రసాద్ నిర్మాతగా వ్యవహారించగా, నందిపాటి వంశీ అనే వ్యక్తి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు.

ఇక  తొలుత ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, ఆశించిన స్థాయిలో థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడలేదు. కాకపోతే ఈ సినిమాకు పెట్టిన ఓవరాల్ డబ్బులు వెనక్కి వచ్చేశాయి. ఇక ఇదివరకే ఈ సినిమా మూడోవ పార్ట్ కూడా ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా పొలిమేర సినిమా పార్ట్ 2 నిర్మాత మూడో భాగాన్ని తీస్తున్న నిర్మాతపై పోలీసు కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ వివాదం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి ఏం జరిగిందంటే.

తాజాగా పొలిమేర2 నిర్మాత గౌరి కృష్ణ ప్రాసాద్, డిస్ట్రిబ్యూటర్ నందిపాటి వంశి పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఎందుకంటే.. ఈ సినిమాకు గౌరి కృష్ణ నిర్మాత వ్యవహరించాడు. ‘ఇక ఆ సినిమాకు దాదాపు రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ, సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసిన వంశీ ఇప్పటివరకు తనకు వచ్చిన లాభాల్లో పైసా కూడా ఇవ్వలేదని, పైగా నా షేర్ నాకు కావాలని డిమాండ్ చేస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని, అంతేకాకుండా.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే దానికి తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడని’ నిర్మాత కృష్ణ ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు పొలిమేర3 కి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది వంశి కా కావడం గమన్హారం. మరి, పొలిమేర 2 నిర్మాత కృష్ణ, డిస్ట్రిబ్యూటర్ వంశీల మధ్య వివాదం పై మీ అభిప్రాయాలను అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişBettilt girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel